Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర జాబితాలోని ఇతర వెనుకబడిన తరగతుల ఉప వర్గీకరణ అంశం పరిశీలనకు ఏర్పాటైన కమిషన్ కాల వ్యవధిని 2018 జూన్ 20వరకూ పొడిగిస్తూ కేంద్ర మంత్రిమండలి ఆమోదం


కేంద్ర జాబితాలోని ఇతర వెనుకబడిన తరగతుల ఉప వర్గీకరణ అంశం పరిశీలనకు ఏర్పాటైన కమిషన్ కాల వ్యవధిని 2018 మార్చి 27 నుంచి రెండోసారి… చివరిసారిగా 2018 జూన్ 20వరకూ 12 వారాలపాటు పొడిగించే ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

నేపథ్యం:

రాజ్యాంగంలోని 340 నిబంధన కింద రాష్ట్రపతి ఆమోదంతో 2017 అక్టోబరు 2న ఈ కమిషన్ ఏర్పాటైంది. అటుపైన విశ్రాంత న్యాయమూర్తి శ్రీమతి జి.రోహిణి నేతృత్వంలోని ఈ కమిషన్ 2017 అక్టోబరు 11 నుంచి పని ప్రారంభించింది. అప్పటినుంచీ ఇతర వెనుకబడిన కులాల ఉప వర్గీకరణ చేపట్టిన అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో రాష్ట్రస్థాయి వెనుకబడిన తరగతుల కమిషన్లతో చర్చించింది. అలాగే ఉన్నత విద్యా కోర్సులలో ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రవేశానికి సంబంధించి సమాచారం ఇవ్వాల్సిందిగా వివిధ ఉన్నత విద్యా సంస్థలను కమిషన్ కోరింది. అంతేకాకుండా ప్రభుత్వంలో భాగమైన వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు తదితరాలలో ఇతర వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కూడా కోరింది. తద్వారా కేంద్ర జాబితాలోని ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ లబ్ధి కల్పనలో చోటు చేసుకున్న అసమాన పంపిణీ తీవ్రతను అంచనా వేయాలని భావించింది. ఆ మేరకు కమిషన్ అందుకున్న సమాచారం భారీ పరిమాణంలో ఉన్నందున దాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి సమగ్ర నివేదిక రూపొందించేందుకు మరింత సమయం అవసరమైంది. దీంతో తమకు మరో 12 వారాలపాటు అంటే.. 2018 జూన్ 20దాకా సమయం పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేయగా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.