Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోల్ కాతా లో 5వ ఇండియా ఇంటర్ నేశనల్ సైన్స్ ఫెస్టివల్ ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కోల్ కాతా లో ఈ రోజు న ఏర్పాటైన 5వ ఇండియా ఇంటర్ నేశనల్ సైన్స్ ఫెస్టివల్ ను వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఈ కార్య‌క్ర‌మం యొక్క ఇతివృత్తమైనటువంటి ‘‘ఆర్ఐఎస్ఇఎన్‌: రిస‌ర్చ్, ఇన‌వేశ‌న్ ఎండ్ సైన్స్ ఎంప‌వ‌రింగ్ ద నేశ‌న్‌’’ 21వ శ‌తాబ్ద‌పు భార‌త‌దేశం యొక్క ఆకాంక్ష‌ల ను ప్ర‌తిబింబిస్తోంద‌న్నారు.

విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞానం స‌మాజం పైన ఒక పెను ప్ర‌భావాన్ని ప్ర‌స‌రిస్తూ ఉంటాయని, ఈ కార‌ణం గానే ప్ర‌భుత్వం ఆవిష్క‌ర‌ణల‌ కు మ‌రియు న‌వ‌క‌ల్ప‌న‌ల కు సంస్థాగ‌త‌మైన‌ మ‌ద్ధ‌తు ను అందిస్తూవస్తోందని ఆయ‌న తెలిపారు. విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞానం.. ఈ రెంటి కి మ‌ద్ధ‌తిచ్చేట‌టువంటి ఒక బ‌ల‌మైన ఇకోసిస్ట‌మ్ ఉండాల‌ని ఆయ‌న సూచిస్తూ, దేశం లో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల కు మ‌ద్ధ‌తివ్వ‌డం కోసం స‌క‌ల ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని వివరించారు. ఈ దిశ గా 5 వేల కు పైగా అట‌ల్ టింక‌రింగ్ ల్యాబ్స్ తో పాటు, 200 ల‌కు పైగా అట‌ల్ ఇంక్యుబేశ‌న్ సెంట‌ర్స్ ను స్థాపించిన సంగతి ని ఆయన ప్రస్తావించారు.

‘‘మ‌న జీవ‌నాన్ని సుల‌భ‌త‌రం గా మ‌ల‌చ‌డం లో విజ్ఞాన శాస్త్రం ఏ విధం గా స‌హాయ‌కారి కాగ‌ల‌దో మ‌నం ఆలోచించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. అందువ‌ల్లే స‌మాజం లో విజ్ఞాన శాస్త్రాని కి ఒక గొప్ప ఉపయుక్తత ఉంది. ప్ర‌తి ఒక్క శాస్త్రవేత్త తో పాటు దేశం లోని ప్రతి ఒక్కరు ఈ ర‌కం గా ఆలోచన చేసి తదనుగుణం గా నడచుకొంటే, అప్పుడు దేశం ముందంజ వేయగలదు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

విజ్ఞాన శాస్త్రం మ‌న‌కు ప్ర‌సాదించేట‌టువంటి దీర్ఘ కాల ప‌రిష్కారాల పై మ‌రియు దీర్ఘ‌ కాల ప్ర‌యోజ‌నాల పై శ్ర‌ద్ధ వ‌హించ‌వ‌ల‌సింది గా ప్ర‌తి ఒక్క‌రి ని ప్ర‌ధాన మంత్రి కోరారు. ‘‘ అంత‌ర్జాతీయ చ‌ట్టాలు మ‌రియు ప్ర‌మాణాల విషయం లోనూ మీరు నిరంత‌రం సావధానం గా ఉండాలి’’ అని కూడా ఆయ‌న చెప్పారు.

‘‘సాంకేతిక విజ్ఞానం అనేది రెండు అంశాల ఫ‌లితం. ఆ రెండు అంశాలు ఏమిటంటే ఒక స‌మ‌స్య యొక్క ఉనికి; ఆయా స‌మ‌స్య‌ల ను ప‌రిష్క‌రించ‌డం కోసం మ‌నం చేప‌ట్టే ప్ర‌యోగాలు. ఈ సంగ‌తి ని మ‌న అంద‌రికి ఎంతో బాగా తెలుసు’’ అని ఆయ‌న అన్నారు.

‘‘విజ్ఞాన శాస్త్రం లో ఓట‌ములు ఉండ‌వు. కేవ‌లం ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు మ‌రియు సాఫ‌ల్యం.. ఇవే ఉన్నాయి. మీరు ప‌ని చేసేట‌ప్పుడు ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకొంటే అప్పుడు మీరు మీ యొక్క జీవ‌నం లో గాని, లేదా మీ యొక్క శాస్త్రీయ ప‌రిశోధ‌న‌ లో గాని ఎటువంటి ఇబ్బందుల ను ఎదుర్కోరు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.