పిఎంఇండియా
ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఫోన్లో సంభాషించారు.
ఈ సందర్భంగా భారత్…. ఖతార్కు అండగా నిలుస్తుందని, ఆ దేశ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతను ఉల్లంఘించే ఏ చర్యలనైనా తీవ్రంగా ఖండిస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
చర్చలు, దౌత్యం ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.
ఈ క్లిష్ట సమయంలో ఖతార్లోని భారతీయ ప్రజలకు అక్కడి అధికారులు అందిస్తున్న మద్దతు, సంరక్షణకు ప్రధానమంత్రి కృతజ్ఞతలను తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘నా సోదరుడు, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడాను. మేం ఖతార్కు దృఢమైన సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. ఆ దేశ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఉల్లంఘనను తీవ్రంగా ఖండిస్తున్నాం. చర్చలు, దౌత్యం ద్వారా ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని మేం చర్చించాం. ఈ కష్టకాలంలో ఖతార్లోని ప్రవాస భారతీయుల సంరక్షిస్తున్నందుకు నా ధన్యవాదాలు తెలియజేశాను.
***
Spoke with my brother, H.H. Sheikh Tamim bin Hamad Al Thani, the Amir of Qatar. We stand firmly in solidarity with Qatar and strongly condemn any violation of its sovereignty and territorial integrity. We emphasized the urgent need to restore peace and stability in the region…
— Narendra Modi (@narendramodi) March 3, 2026