పిఎంఇండియా
‘‘త్వత్సంభావితమాత్మానం బహు మాన్యామహే వయమ్ ప్రాయః ప్రత్యయమాధత్తే స్వగుణేషుత్తమాదరః’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
మనని ఎవరైనా గౌరవిస్తే ఎంతో ఆనందాన్నీ, ధన్యతనీ పొందినట్లు భావిస్తాం. దీనికి కారణం గొప్ప వారు చూపిన ఆదరణ ఒక వ్యక్తిలో అతని లేదా ఆమె గుణాల పట్ల ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలుపుతుంది.. ఇది పూర్తిగా నిజం అని ఈ సుభాషితం మనకు చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ,
‘‘స్నేహపూర్వక గౌరవం, అంగీకార భావన.. ఇవి వ్యక్తికి గర్వకారణం కావడంతో పాటు, సంతోషాన్నిస్తాయి. దీంతో ఆత్మవిశ్వాసం పెరగడమే కాక ఒక కొత్త శక్తి, ఉత్సాహం కూడా కలుగుతాయి.
త్వత్సంభావితమాత్మానం బహు మాన్యామహే వయమ్
ప్రాయః ప్రత్యయమాధత్తే స్వగుణేషుత్తమాదరః’’ అని పేర్కొన్నారు.
स्नेहपूर्ण सम्मान और स्वीकार्यता व्यक्ति को गर्व और संतोष का अनुभव कराती है। इससे जहां आत्मविश्वास बढ़ता है, वहीं एक नई ऊर्जा और उत्साह का भी संचार होता है।
— Narendra Modi (@narendramodi) June 17, 2026
त्वत्सम्भावितमात्मानं बहु मन्यामहे वयम् ।
प्रायः प्रत्ययमाधत्ते स्वगुणेषूत्तमादरः।। pic.twitter.com/ccsmCUFaXo