Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గౌహతి ఐఐఐటీ క్యాంపస్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని; ఈశాన్య ప్రాంత ఐఐటీ, ఎన్ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగం

గౌహతి ఐఐఐటీ క్యాంపస్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని;
ఈశాన్య ప్రాంత ఐఐటీ, ఎన్ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగం

గౌహతి ఐఐఐటీ క్యాంపస్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని;
ఈశాన్య ప్రాంత ఐఐటీ, ఎన్ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగం

గౌహతి ఐఐఐటీ క్యాంపస్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని;
ఈశాన్య ప్రాంత ఐఐటీ, ఎన్ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగం


గౌహతి ఐఐఐటీ క్యాంపస్ భవన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన ఫలకాన్ని ప్రదాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈశాన్య ప్రాంత ఐఐటీ, ఎన్ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 21 వ శతాబ్ధం విజ్ఞాన శతాబ్ధం అని ఆయన అన్నారు.

ప్రపంచానికి చోదక శక్తిగా విజ్ఞానం ఉన్నప్పుడల్లా దానికి భారతదేశమే దానికి నాయకత్వాన్ని అందించినట్లు చరిత్ర చెబుతోందన్నారు. ఈ వేళ జనసంఖ్య పరంగా చూసుకుంటే యువత ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశంగా భారత్ నిలిచిందని, యువతీయువకుల స్వప్నాలు ఈ దేశానికి ఊతకర్రగా నిలుస్తున్నాయన్నారు. అయితే ప్రపంచానికి మరొకసారి నాయకత్వం వహించే అవకాశం భారత్ కు దక్కడంతో పాటు ఇది ఈ దేశానికి ఒక సవాలు కూడా అని ఆయన వివరించారు.

భారత దేశం అత్యంత పురోగమిస్తున్న ఆర్తిక వ్యవస్థ అని ప్రప్రంచంలోని పలు ఆర్థిక సర్వేలు పేర్కొంటున్నాయని ప్రధాని ఈ సందర్బంగా అన్నారు. యువత పై ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నదని ప్రధాని చెప్పారు. నైపుణ్యాలకు మెరుగులు దిద్దడం, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఉద్యమం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావించారు.

ఎలక్ట్రానిక్స్ , రక్షణ రంగ పరికరాల తయారీ లను ప్రాధాన్య రంగాలుగా గుర్తించినట్లు ప్రధాని ప్రత్యేకంగా తెలిపారు.