Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జలవనరుల అభివృద్ధి యాజమాన్య రంగంలో సహకారానికి భారతదేశం డెన్మార్క్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం


జలవనరుల అభివృద్ధి యాజమాన్య రంగంలో సహకారానికి భారతదేశం డెన్మార్క్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవగాహన ఒప్పందం ముఖ్య అంశాలు :

•    డిజిటలైజేషన్ మరియు సమాచార ప్రాప్యత సౌలభ్యం
 •   సమగ్ర  మరియు స్మార్ట్ నీటి వనరుల అభివృద్ధి మరియు నిర్వహణ,
 •   జలధార మ్యాపింగ్, భూగర్భ జలాల నమూనా, పర్యవేక్షణ మరియు రీఛార్జ్,
 •   ఆదాయం లేని జలవనరులు వాడకం   మరియు ఇంధన  వినియోగం తగ్గించి గృహ  స్థాయిలో సమర్థవంతమైన మరియు  స్థిరమైన నీటి సరఫరా,   
 •   జీవనోపాధి, స్థితిస్థాపకత మరియు ఆర్థికాభివృద్ధి సాదించేందుకు  నది మరియు జలవనరుల  పునరుజ్జీవనం
 •   నీటి నాణ్యత పర్యవేక్షణ మరియు నిర్వహణ;
 • మురుగునీరు/మురుగునీటి శుద్ధి, మురుగు నీటి పునర్వినియోగం/రీసైక్లింగ్ కోసం వృత్తాకార  వ్యవస్థను అభివృద్ధి చేయడంతో  సహా సమగ్ర బురద నిర్వహణ మరియు నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య     రంగంలో పునరుత్పాదక శక్తిని ఎక్కువగా  ఉపయోగించడం
 •   ప్రకృతి ఆధారిత పరిష్కారాలతో వాతావరణ మార్పులను అరికట్టి, నివారణ చర్యలు అమలు చేయడం  
 •    నది కేంద్రీకృత పట్టణ ప్రణాళిక రూపొందించి పట్టణ ప్రాంతాల్లో  వరద నిర్వహణ 
 •   అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల వెలుపల ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం ప్రకృతి ఆధారిత  నివారణ చర్యలు అమలు చేయడం 

అవగాహన ఒప్పందం వల్ల రెండు దేశాల మధ్య జల వనరుల అభివృద్ధి, నిర్వహణ, గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ,అధికారులు, విద్యావేత్తలు, జల వనరుల రంగం, పరిశ్రమల రంగంలో సహకారం మరింత పెరుగుతుంది. 

నేపథ్యం:  

  డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడరిక్‌సెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీల సహ అధ్యక్షతన 2022 సెప్టెంబర్ 28న భారతదేశం మరియు డెన్మార్క్ దేశాల మధ్య వర్చువల్ విధానంలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ స్థాపనపై రెండు దేశాలు సంయుక్త ప్రకటనను చేశాయి.  పర్యావరణం / నీరు మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ మరియు స్మార్ట్ సిటీ ల అభివృద్ధి తో సహా స్థిరమైన పట్టణాభివృద్ధి రంగంలో కలిసి పనిచేయాలని రెండు దేశాలు అంగీకరించాయి.

 

2021 అక్టోబర్ 9వ తేదీన డెన్మార్క్ ప్రధాన మంత్రి  మెట్టె ఫ్రెడరిక్‌సెన్ని కలిసిన తరువాత ప్రధానమంత్రి శ్రీ నరెంద్ర మోదీ  ఇతర అంశాలతో పాటు గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌పైకింది ప్రకటన విడుదల చేశారు. 

 •   స్మార్ట్ వాటర్    వనరుల నిర్వహణ కోసం సెంటర్ స్థాపన (CoESWaRM) 

•    పంజీ లోని స్మార్ట్ సిటీ ల్యాబ్ తరహాలో వారణాసిలో స్వచ్ఛమైన నదుల కోసం ల్యాబ్ ఏర్పాటు
 భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డెన్మార్క్ పర్యటన సందర్భంగా 03 మే, 2022న భారతదేశ  జలశక్తి మంత్రిత్వ శాఖ, డెన్మార్క్   పర్యావరణ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వం మధ్య ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ సంతకం చేయబడింది.   స్మార్ట్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు వారణాసిలో క్లీన్ రివర్ వాటర్స్‌పై స్మార్ట్ ల్యాబ్ ఏర్పాటు చేయడం కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ సంతకం చేయబడింది.  ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి సురక్షితమైన మరియు సురక్షితమైన నీటిని అందుబాటులోకి తీసుకుని రావడానికి సంపూర్ణ మరియు స్థిరమైన విధానం అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రెండు దేశాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.  జలశక్తి శాఖ డెన్మార్క్ పర్యటన సందర్భంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ లో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా భారత జలవనరులు,గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ,  డెన్మార్క్   పర్యావరణ మంత్రిత్వ శాఖ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై 12.09.2022న రెండు దేశాలు సంతకాలు చేశాయి.

***