Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాగ‌ర‌ణ్ ఫోర‌మ్ లో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం

జాగ‌ర‌ణ్ ఫోర‌మ్ లో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం

జాగ‌ర‌ణ్ ఫోర‌మ్ లో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జాగ‌ర‌ణ్ ఫోర‌మ్‌ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్రమాన్నిజాగ‌రణ్ ప్ర‌కాశ‌న్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది.

ప్ర‌జాస్వామ్యంలో జాగృతికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఉద్ఘాటించ‌డానికి ప్ర‌ధాని “ఎల్ల‌ప్పుడూ జాగ‌రూక‌త‌తో ఉండ‌డ‌మ‌నేది స్వేచ్ఛకు చెల్లించాల్సిన మూల్యం” అనే మాట‌ల‌ను ఉదాహ‌రించారు. చైత‌న్య‌వంత‌మైన ప్ర‌జాస్వామ్యానికి కావ‌ల‌సింద‌ల్లా జ‌న్ భాగీదారీ- అంటే, ప్రజల ప్రాతినిధ్యం అని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరాన్ని మహాత్మ గాంధీ ఎలా ప్రజా ఉద్యమంగా మార్చగలిగారో ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశ అభివృద్ధి ప్రక్రియకు కూడా “జన్- ఆందోళన్” నమూనానే వర్తింపచేయాలి అని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం రాక ముందు చేసిన చట్టాలు ప్రజలను నమ్మరాదనే ఆధారవాక్యం పునాదిగా రూపొందాయని ప్రధాని చెప్పారు. అయితే, ఈ వైఖరి ఇక మారాలని ఆయన అన్నారు. ఈ సందర్భంలో.. దస్తావేజుల స్వయంధ్రువీకరణ, స్వచ్ఛ భారత్ అభియాన్ లో ప్రజల భాగస్వామ్యం, ఎల్ పీ జీ సబ్సిడీని వదులుకోండంటూ సాగుతున్న ప్రచార ఉద్యమం వంటి ఉదాహరణలను ప్రధాని ప్రస్తావించారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన, “స్టార్టప్ ఇండియా- స్టాండప్ ఇండియా” వంటి కార్యక్రమాలు ఎంతటి సానుకూల ప్రభావాన్ని కలిగిస్తున్నాయో ఆయన వివరించారు. “కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన” అనే విధానం గురించి, అతి ప్రాచీన చట్టాలకు స్వస్తి పలుకుతున్న తీరును గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు.