పిఎంఇండియా
భారతదేశంలోని మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలకు సంబంధించిన కీలకమైన అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మహిళల పురోగతికి ఆటంకం ఎదురవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ.. నారీ శక్తి వందన్ అధీనియం సవరణ ఆమోదం పొందలేకపోయిందనీ, ఇది మహిళల చట్టబద్ధమైన ఆకాంక్షలను విచ్ఛిన్నం చేసిందనీ అన్నారు. ‘‘ఈ దురదృష్టకర ఫలితం నేపథ్యంలో మాతృమూర్తులు, అక్కాచెళ్లెల్లు, కుమార్తెలందరినీ నేను క్షమాపణలు కోరుతున్నాను.’’
జాతీయ ప్రయోజనాలే సర్వోన్నతమైనవని చెబుతూ.. దేశ సంక్షేమం కంటే పక్షపాత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న నిర్దిష్ట రాజకీయ పక్షాలను ప్రధానమంత్రి తీవ్రంగా విమర్శించారు.
దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర నిరాశ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ బిల్లు వీగిపోవడం మహిళల ఆత్మగౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడి అనీ, మహిళా ఓటర్లు ఈ అవమానాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారనీ చెప్పారు. ‘‘మహిళలు దేన్నైనా మరచిపోవచ్చు. కానీ వారి ఆత్మగౌరవానికి జరిగిన అవమానాన్ని ఎన్నటికీ మరచిపోరు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఈ దురుద్దేశాల గురించి భారతీయ మహిళలకు బాగా తెలుసనీ, దోషులైన రాజకీయ నాయకులను భవిష్యత్తులో కఠినమైన రీతిలో జవాబుదారీగా నిలబెడతారన్నారు. పరివర్తనాత్మకమైన నారీశక్తి వందన్ అధీనియం సవరణ దార్శనికత గురించి వివరిస్తూ.. జనాభాలో సగభాగం ఉన్నవారికి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న హక్కులను అందించి, కొత్త అవకాశాలను కల్పించే గొప్ప ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. వ్యవస్థీకృత అవరోధాలను తొలగించి, పరిమాణం, భౌగోళిక స్థితితో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ శక్తిని సమానంగా పెంపొందించడమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు. ‘‘భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళలను సహ ప్రయాణికులుగా మార్చేందుకు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నమే ఈ సవరణ’’ అని శ్రీ మోదీ చెప్పారు.
ఈ నీచ రాజకీయ ధోరణిని దేశ పౌరులు గుర్తించారని, వాటి వెనక ఉన్న ఉద్దేశాలను పూర్తిగా అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘‘మహిళల హక్కులను హరించేందుకు ఉపయోగించిన ఈ నీచ రాజకీయ ఎత్తుగడలను ఇప్పుడు దేశం పూర్తిగా అర్థం చేసుకుంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.
తమ కుటుంబాలకు చెందని సాధికార మహిళలు.. స్థానికంగా తమ నాయకత్వానికి సవాలు విసురుతారని కుటుంబ రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం పంచాయతీల్లో సేవలందిస్తున్న వేలాదిమంది సమర్ధులైన మహిళలు.. వంశపారంపర్య రాజకీయ నాయకుల్లో ఉన్న అభద్రతా భావాన్ని నేరుగా సవాలు చేస్తున్నారని వివరించారు.
పునర్విభజనకు సంబంధించి ప్రచారంలో ఉన్న అసత్య కథనాలను ప్రధానమంత్రి ఖండించారు. ఏ రాష్ట్రమూ ప్రాతినిధ్యం కోల్పోదనీ, అన్ని రాష్ట్రాలకూ సమాన స్థాయిలో, న్యాయబద్ధంగా సీట్లు పెరుగుతాయనీ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి చేజారిన అవకాశాలను ప్రస్తావిస్తూ.. సవరణ అమల్లోకి వచ్చి ఉంటే తమిళనాడు, బెంగాల్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు గణనీయంగా పెరిగి ఉండేవన్నారు.
గతంలో వ్యతిరేకించిన అనేక పరివర్తనాత్మక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వివరించారు. జన్ధన్-ఆధార్-మొబైల్ త్రయం, డిజిటల్ చెల్లింపులు, జీఎస్టీ, ముమ్మారు తలాక్పై నిషేధ చట్టాన్ని అప్పట్లో అడ్డుకున్నారని గుర్తుచేశారు. అలాగే సీఏఏ చట్టంపై కూడా గతంలో గందరగోళం సృష్టించారని, మావోయిస్టు హింసను నిర్మూలించే ప్రయత్నాలకు నిరంతర ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు.
భారతదేశంలో ఉన్న చారిత్రక అభివృద్ధి జాప్యాల గురించి ప్రస్తావిస్తూ.. స్వాతంత్ర్యానంతరం అవసరమైన నిర్ణయాలను పక్కన పెట్టే విధానమే ఇతర దేశాల కంటే భారత్ వెనకబడి ఉండటానికి కారణమైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సరిహద్దు వివాద పరిష్కారాలు, ఓబీసీ రిజర్వేషన్లు, సైనికుల కోసం ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ పథకం సహా కీలకమైన నిర్ణయాలను నిలిపి ఉంచడంలోనే 40 ఏళ్లు గడిచిపోయాయని విమర్శించారు.
ఇలాంటి అనిశ్చితి, మోసం కారణంగా తరాలుగా భారతీయులు తీవ్రంగా నష్టపోయారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పోరాటం ఒక్క చట్టానికి మాత్రమే సంబంధించినది కాదనీ, లోతుగా పాతుకుపోయిన ప్రతికూలమైన, సంస్కరణల వ్యతిరేక మనస్తత్వంతో చేస్తున్న విస్తృత యుద్ధమని తెలిపారు. ‘‘ఈ రకమైన విషపూరిత మనస్తత్వానికి ఈ దేశంలోని అక్కాచెళ్లెల్లు, అమ్మాయిలు తగిన బదులు ఇస్తారనే విషయంలో నాకెలాంటి సందేహం లేదు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఈ బిల్లు వీగిపోవడం వల్ల ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదనను ప్రధానమంత్రి తోసిపుచ్చారు. ఈ చట్టానికి ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చి ఉంటే.. ప్రకటనల ద్వారా వారికి పూర్తి ఘనతను ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘‘ఇది రాజకీయ పేరు ప్రఖ్యాతులకు సంబంధించినది కాదు. ఇది హక్కులను సురక్షితం చేయడం గురించే’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
మహిళా సాధికారత పట్ల తనకున్న అంచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ.. నిరాశలో మునిగిపోయిన లక్షలాది మంది మహిళలకు సంఘీభావం తెలిపారు. పార్లమెంటులో తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ.. తన సంకల్పం దృఢంగా ఉందని వారికి భరోసానిచ్చారు. భవిష్యత్తులో ఈ చట్టానికి ఎదురయ్యే ప్రతి అవరోధాన్నీ తొలగిస్తామని వాగ్దానం చేశారు. దేశంలో 100 శాతం మంది మహిళలు అందించే ఆశీస్సులతో ఈ అంశంలో తమ ప్రభుత్వం విజయం సాధిస్తుందన్నారు. ‘‘సగం జనాభా ఆకాంక్షల కోసం, దేశ భవిష్యత్తు కోసం.. మనం ఈ సంకల్పాన్ని నెరవేర్చాలి’’ అని శ్రీ మోదీ అన్నారు.
****
My address to the nation. https://t.co/2Vyx15A4rx
— Narendra Modi (@narendramodi) April 18, 2026
नारी सब भूल जाती है, अपना अपमान कभी नहीं भूलती: PM @narendramodi pic.twitter.com/A76uJkfOlK
— PMO India (@PMOIndia) April 18, 2026
संसद में नारीशक्ति वंदन संशोधन का जिन भी दलों ने विरोध किया है, वे लोग नारी शक्ति को for granted ले रहे हैं: PM @narendramodi pic.twitter.com/W23Fwq214H
— PMO India (@PMOIndia) April 18, 2026
नारी शक्ति वंदन संशोधन 21वीं सदी की महिलाओं को सशक्त बनाने का एक ‘महायज्ञ’ था। pic.twitter.com/ckEZw7KGWd
— PMO India (@PMOIndia) April 18, 2026
नारी शक्ति वंदन अधिनियम के विरोध की एक बड़ी वजह है... इन परिवारवादी पार्टियों का डर। pic.twitter.com/tmLu8HeqeG
— PMO India (@PMOIndia) April 18, 2026
कांग्रेस, एक एंटी रिफॉर्म पार्टी है। pic.twitter.com/8JuChzCVWn
— PMO India (@PMOIndia) April 18, 2026
कांग्रेस के एंटी रिफॉर्म रवैये ने हमेशा देश का बहुत बड़ा नुकसान किया है। pic.twitter.com/XmLtrjZOnL
— PMO India (@PMOIndia) April 18, 2026
देश की 100 परसेंट नारीशक्ति का आशीर्वाद हमारे साथ है: PM @narendramodi pic.twitter.com/AGEu61h5nS
— PMO India (@PMOIndia) April 18, 2026
हम महिला आरक्षण के रास्ते में आने वाले हर रुकावट को खत्म करेंगे: PM @narendramodi pic.twitter.com/1kdNM1WGNl
— PMO India (@PMOIndia) April 18, 2026
महिलाओं से उनके अधिकार छीनकर ये लोग मेजें थपथपा रहे थे।
— PMO India (@PMOIndia) April 18, 2026
वो नारी के स्वाभिमान पर...उसके आत्मसम्मान पर चोट थी। pic.twitter.com/a0G8cH6hrq
कांग्रेस, महिला आरक्षण के विषय से ही नफरत करती है।
— PMO India (@PMOIndia) April 18, 2026
उसने हमेशा ही महिला आरक्षण को रोकने के लिए षड्यंत्र किए हैं! pic.twitter.com/IsmdqPAYUc
महिला आरक्षण का विरोध करके जो पाप विपक्ष ने किया है... इसकी उन्हें सजा जरूर मिलेगी। pic.twitter.com/32UlMi5oNe
— PMO India (@PMOIndia) April 18, 2026
महिला आरक्षण का विरोध करके विपक्षी दलों ने संविधान निर्माताओं की भावनाओं का अपमान किया है। देश की नारी शक्ति के स्वाभिमान और आत्मसम्मान पर चोट करने वाले अब माताओं-बहनों और बेटियों के आक्रोश से बच नहीं पाएंगे। pic.twitter.com/bEvWmYIlQo
— Narendra Modi (@narendramodi) April 18, 2026
नारी शक्ति वंदन अधिनियम से जुड़ा संशोधन भारतवर्ष की नारी को नई उड़ान देने का महायज्ञ था। लेकिन कांग्रेस, TMC, समाजवादी पार्टी और DMK जैसे दलों ने इसकी भ्रूणहत्या कर दी। pic.twitter.com/EOH9dG0iI9
— Narendra Modi (@narendramodi) April 18, 2026
मुझे व्यक्तिगत तौर पर आशा थी कि महिला आरक्षण को लेकर कांग्रेस अपने पापों का प्रायश्चित करेगी। लेकिन उसने एक बार फिर इस अवसर को खो दिया। pic.twitter.com/4xPgXQONV0
— Narendra Modi (@narendramodi) April 18, 2026
नारी शक्ति वंदन अधिनियम के विरोध की एक बड़ी वजह है- परिवारवादी पार्टियों का डर! उन्हें लगता है कि महिलाएं सशक्त हो गईं, तो उनका नेतृत्व खतरे में पड़ जाएगा। pic.twitter.com/Y6nDnN6swS
— Narendra Modi (@narendramodi) April 18, 2026