పిఎంఇండియా
నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ టి సి ఎల్) కు చెందిన ఇందు-6 మిల్లు భూమిలో నుండి 12 ఎకరాల స్థలాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కు ఒక స్మృతి చిహ్నాన్ని నిర్మించేటందుకుగాను మహారాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించడానికి సంబంధించిన నియమ నిబంధనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
పూర్వ రంగం:
ముంబయ్ లోని నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ టి సి ఎల్) కు చెందిన ఇందు-6 మిల్లు భూమికి దగ్గరలో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చైత్యభూమి నెలకొన్నది. ఈ చైత్యభూమి లక్షలాది భారతీయులకు యాత్రాస్థలంగా పేరొందినది.
నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ కు చెందిన ఇందు-6 మిల్లు భూమిలో నుండి 12 ఎకరాల స్థలాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కు దీటైన ఓ స్మారకాన్ని నిర్మించడం కోసమని- ఇందుకోసం సిక్ టెక్స్ టైల్ అండర్ టేకింగ్స్ (నేషనలైజేషన్) అమెండ్ మెంట్ యాక్ట్, 1995 లోని 11 ఎ నిబంధన కింద నష్టపరిహారాన్ని చెల్లిస్తే- మహారాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించేటందుకు కేంద్ర మంత్రిమండలి ఇప్పటికే ఆమోదం తెలిపింది. అంతే కాకుండా భారత ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం మరియు నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లు కుదుర్చుకున్న ఒక త్రైపాక్షిక అవగాహనపూర్వక ఒప్పందాన్ని కూడా మంత్రిమండలి ఖాయపరచింది.