పిఎంఇండియా
‘‘విజ్ఞానసారథిర్యస్తు మనఃప్రగ్రహవాన్నరః సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ఏ వ్యక్తి బుద్ధి సచేతనంగా ఉంటూ, శాస్త్రీయ సారథిగా వ్యవహరిస్తుందో, ఏ వ్యక్తి మనస్సు క్రమశిక్షణతో, అదుపులో ఉంటుందో.. ఆ వ్యక్తి జీవన సంక్లిష్టతల్ని అధిగమించి, తుది లక్ష్యాన్ని సాధించగలుగుతారని ఈ సుభాషితం స్పష్టం చేస్తోంది.
‘డిజిటల్ ఇండియా’ విజయవంతంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం భారత్కు ప్రపంచంలో ఒక కొత్త గుర్తింపును అందించిందని కూడా శ్రీ మోదీ అన్నారు. ఇది నూతన ఆవిష్కరణలతో పాటు సాంకేతికతను అనుసరిస్తూ దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకుపోవడానికి దేశ ప్రజలు దృఢసంకల్పాన్ని చెప్పుకొన్నారని కూడా సూచిస్తోందని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘‘డిజిటల్ ఇండియా’ విజయవంతంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో భారత్కు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త గుర్తింపు లభించింది. ఇది నూతన ఆవిష్కరణలతో పాటు సాంకేతికతను అనుసరిస్తూ దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకుపోవాలన్న మన పౌరుల దృఢసంకల్పాన్ని చాటుతోంది.
విజ్ఞానసారథిర్యస్తు మనఃప్రగ్రహవాన్నరః
సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్’’ అని పేర్కొన్నారు.
***
डिजिटल इंडिया के 11 वर्षों की सफलता से भारतवर्ष को दुनियाभर में एक नई पहचान मिली है। इससे इनोवेशन और टेक्नोलॉजी को अपनाकर देश को नई ऊंचाइयों पर ले जाने की देशवासियों की संकल्पशक्ति का पता चलता है।
— Narendra Modi (@narendramodi) July 1, 2026
विज्ञानसारथिर्यस्तु मनःप्रग्रहवान्नरः।
सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं… pic.twitter.com/VhIRgvl4Jo