Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

త‌జికిస్థాన్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు


త‌జికిస్థాన్ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆ దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ” త‌జికిస్థాన్ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. త‌జికిస్థాన్ తో భార‌త్‌కు బ‌ల‌మైన చ‌రిత్రాత్మ‌క‌, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. వ్య‌వ‌సాయ రంగం, కనెక్టివిటీ, వాణిజ్యం, ర‌క్ష‌ణ రంగాల్లో బంధాన్ని మ‌రింత ప‌టిష్టం చేసేందుకు ఇరు దేశాలు క్రియాశీలంగా ప‌నిచేస్తున్నాయి ” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***