పిఎంఇండియా
పన్నులకు సంబంధించిన సమాచారాన్ని భారతదేశం, మాల్దీవులు ఒక దేశానికి మరొక దేశం ఇచ్చి, పుచ్చుకోవడానికి వీలుగా ఒక ఒప్పందంపై జరిగిన సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది.
ఈ ఒప్పందం పన్ను చెల్లింపుల ఎగవేతను, పన్ను కట్టడం మానివేయడాన్ని నివారించడంలో ఉపయోగపడే సమాచారాన్ని ఇరు దేశాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకొనేందుకు వీలు కల్పిస్తుంది.