పిఎంఇండియా
కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. జౌళి పరిశ్రమ వ్యర్థాల పునర్వినియోగం, పర్యావరణహిత ఉత్పత్తి విధానాలు, గ్రీన్ టెక్నాలజీ వంటి కార్యక్రమాలు వస్త్ర రంగాన్ని పునర్వినియోగానికి అనువుగా, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దుతున్న తీరుని ఈ కథనం వివరిస్తుంది. భారత జీవన విధానంలో సుస్థిరత భాగమని, ఇప్పుడది మన జౌళి రంగానికి సరికొత్త భవిష్యత్తును అందిస్తోందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
చాలా కాలంగా భారత జీవన విధానంలో సుస్థిరత అంతర్భాగం. ఇప్పుడది మన జౌళి రంగానికి సరికొత్త భవిష్యత్తును అందిస్తోంది.
వస్త్ర వ్యర్థాల పునర్వినియోగం, పర్యావరణహిత ఉత్పత్తి విధానాలు, గ్రీన్ టెక్నాలజీ వంటి కార్యక్రమాలు మన జౌళి రంగాన్ని పునర్వినియోగానికి అనువుగా, పోటీతత్వంతో కూడినదిగా తీర్చిదిద్దటంలో తోడ్పడుతున్న తీరుని కేంద్రమంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈ కథనంలో వివరించారు.
***
Sustainability has long been integral to India's ethos. It is now shaping the future of our textile sector.
— PMO India (@PMOIndia) September 19, 2026
In this article, Union Minister Shri @girirajsinghbjp highlights how initiatives around textile recycling, cleaner production and green technologies are helping build a… https://t.co/x8ol47oOFW