Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ని ఎఐఐఎమ్ఎస్ లో కలుసుకొన్న ప్ర‌ధాన మంత్రి


పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ లో ఈ రోజు కలుసుకొన్నారు.

శ్రీ వాజ్‌పేయీ కుటుంబ స‌భ్యుల‌తో ప్ర‌ధాన మంత్రి సంభాషించారు. అలాగే వైద్యుల‌తో కూడా ఆయన మాట్లాడి శ్రీ వాజ్‌పేయీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు.

శ్రీ న‌రేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ లో దాదాపు 50 నిమిషాల సేపు ఉన్నారు.

***