పిఎంఇండియా
కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి రాసిన ఒక వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘మాతృ వందన యోజన’కు పది సంవత్సరాలతో పాటు, ‘పోషణ మాసం’ సందర్భంగా రాసిన ఆ వ్యాసం.. అంగన్వాడీ వ్యవస్థను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలన్న సందేశాన్నిస్తోంది. బాలలకు, మహిళలకు, యౌవన దశలో ఉన్న బాలికలకు ప్రయోజనాల ప్రత్యక్ష బదిలీ (డీబీటీ), సామాజిక ఆడిట్లు, పుష్టికరమైన ఆహారం ఏ విధంగా సాయపడుతున్నదీ ఈ వ్యాసం వివరించింది. ఈ కార్యక్రమాలు ‘‘హమారీ అంగన్వాడీ, హమారీ జిమ్మేదారీ’’ (మా అంగన్వాడీ, మా బాధ్యత) దార్శనికత నుంచి స్ఫూర్తిని పొంది పోషకాహార లోపానికి తావు ఇవ్వని, ‘అభివృద్ధి చెందిన భారత్’ను ఆవిష్కరించడానికి తోడ్పడుతున్నాయని మంత్రి వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘మాతృ వందన యోజన’కు పది సంవత్సరాలు, ‘పోషణ మాసం’ అంశాలపై కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి గారు రాసిన ఈ వ్యాసం అంగన్వాడీ వ్యవస్థను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలనే సందేశాన్ని ఇస్తోంది. బాలలు, మహిళలు, యౌవన దశకు చేరుకున్న బాలికలకు డీబీటీ, సోషల్ ఆడిట్, పౌష్టిక ఆహారంతో మద్దతు లభిస్తున్న తీరును మంత్రి ఈ వ్యాసంలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమాలు.. ‘హమారీ అంగన్వాడీ, హమారీ జిమ్మేదారీ’ దార్శనికతతో పోషకాహార లోపానికి చోటు ఉండని, ‘వికసిత్ భారత్’ గమ్యాన్ని చేరుకోవడానికి తోడ్పడుతున్నాయి’’ అని పేర్కొంది.
***
मातृ वंदना योजना के 10 वर्ष और पोषण माह पर, केंद्रीय मंत्री श्रीमती @Annapurna4BJP जी का यह आलेख आंगनवाड़ी व्यवस्था को जन-आंदोलन बनाने का संदेश देता है। वे रेखांकित करती हैं कि कैसे डीबीटी, सोशल ऑडिट और पौष्टिक आहार से बच्चों, महिलाओं और किशोरियों को संबल मिल रहा है। यह प्रयास… https://t.co/AYSNcqmf8u
— PMO India (@PMOIndia) September 8, 2026