Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై వరుసగా అత్యధిక కాలం సేవలందించిన


ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై వరుసగా అత్యధిక కాలంపాటు దేశానికి సేవలందించిన భారత ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీ.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలుప్రభుత్వాధినేతల నుంచి అభినందన సందేశాలను అందుకుంటున్నారు.

 భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని తన స్నేహితుడుసోదరుడుమార్గదర్శిగా అభివర్ణిస్తూ.. గౌరవ భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే ఆయనకు ఇలా శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నా మిత్రుడుసోదరుడుమార్గదర్శి.

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి గౌరవ శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారుఇరు దేశాల మధ్య సుదీర్ఘకాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు శ్రీలంక కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారుభారత్‌లోని శ్రీలంక హైకమిషన్ కూడా ఆ దేశ అధ్యక్షుడు దిసనాయకె సందేశాన్ని అందించిందిభారత్ – శ్రీలంక మధ్య ఉన్న సన్నిహితశాశ్వత భాగస్వామ్యాన్ని స్పష్టం చేసింది.

భారత్ చరిత్రలో అత్యధిక కాలం పాటు సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలుమన సన్నిహిత భాగస్వామ్యాన్ని అత్యంత విలువైనదిగా శ్రీలంక చూస్తోందిరెండు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.’’

భారత్ చరిత్రలో అత్యధిక కాలంపాటు సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన శ్రీ నరేంద్ర మోదీ గారికి శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర దిసనాయకే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మధ్య సన్నిహితచిరకాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో  నిబద్ధతను ఈ సందేశం స్పష్టం చేస్తోంది.’’

చరిత్రాత్మక మైలురాయిని అధిగమించిన భారత ప్రధానమంత్రికి గౌరవ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం శుభాకాంక్షలు తెలిపారుఎన్నో ఏళ్ల అంకితభావంతో కూడిన ప్రజాసేవకూనాయకత్వానికీ నిదర్శనంగా దీనిని అభివర్ణించారుద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు ఇరుదేశాల ప్రజలకూ అవకాశాలను విస్తరించుకునేందుకు మలేషియా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

భారత్‌లో అత్యంత సుదీర్ఘ కాలం సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా చరిత్రాత్మక మైలురాయిని అధిగమించిన మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలుఎన్నో ఏళ్లుగా అంకితభావంతో కూడిన ఆయన ప్రజాసేవకూదేశ అభివృద్ధి– సమృద్ధిని ముందుకు తీసుకెళ్లిన ఆయన నాయకత్వానికీ ఈ విజయం నిదర్శనంభారత్‌తో సన్నిహితదీర్ఘకాలిక మైత్రిని అత్యంత విలువైనదిగా మలేషియా భావిస్తోందిద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంలోనూమన ప్రజలకు అవకాశాలను విస్తరించడంలోనూ ఇరుదేశాల మధ్య సహకారాన్ని కొనసాగించే దిశగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి నిరంతర విజయమూఅలాగే భారత ప్రజలకు శాంతిపురోగతిసమృద్ధులూ చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.’’

***