పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని యునైటెడ్ స్టేట్స్ రక్షణ మంత్రి శ్రీ ఎశ్టన్ కార్టర్ ఈ రోజు కలుసుకొన్నారు.
భారతదేశానికి, యునైటెడ్ స్టేట్స్ కు మధ్య రక్షణ రంగ సహకారాన్ని పటిష్టపరచడంలో మంత్రి శ్రీ కార్టర్ చేసిన కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
ఈ సంవత్సరం జూన్ లో ప్రధాన మంత్రి తాను యునైటెడ్ స్టేట్స్ లో జరిపిన పర్యటన విజయవంతమైన సంగతిని గుర్తుకు తెచ్చుకొన్నారు. యుఎస్ తో బలిష్ఠమైన మరియు దృఢమైన ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని భారతదేశం కొనసాగిస్తుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
ఈ సంవత్సరం జూన్ లో తీసుకున్న నిర్ణయాలను, కుదిరిన అవగాహనను ముందుకు తీసుకువెళ్లడంలో చోటుచేసుకొంటున్న పురోగతిని ప్రధాన మంత్రికి మంత్రి శ్రీ కార్టర్ వివరించారు.
వారు ఉభయులు ప్రాంతీయ అంశాలపైన మరియు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పరిణామాలపైన అభిప్రాయాలను పరస్పరం తెలియజేసుకొన్నారు.
Mr. Ashton Carter, US Secretary of Defence met PM @narendramodi in Delhi. @DeptofDefense pic.twitter.com/DU9j9TxjxS
— PMO India (@PMOIndia) December 8, 2016
Had a very good meeting with US Secretary of Defence, Mr. Ashton Carter. pic.twitter.com/VtSmnnhq2z
— Narendra Modi (@narendramodi) December 8, 2016