Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి


బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన’ను సెప్టెంబర్ 26న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారుఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి బీహార్ వ్యాప్తంగా 75 లక్షలమంది మహిళల బ్యాంకు ఖాతాలలోకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున  7,500 కోట్ల రూపాయల మొత్తాన్ని నేరుగా బదిలీ చేస్తారు

ఈ పథకం మహిళలను ఆత్మనిర్భర్ గా మార్చడంస్వయం ఉపాధిజీవనోపాధి అవకాశాల ద్వారా మహిళా సాధికారతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందిఇది రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి  ఒక మహిళకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందివారు తమకు నచ్చిన ఉపాధి లేదా జీవనోపాధి కార్యకలాపాలను ప్రారంభించడానికి వీలు కల్పిస్తుందితద్వారా ఆర్థిక స్వాతంత్ర్యంసామాజిక సాధికారతను ప్రోత్సహిస్తుంది.

ఈ పథకం కిందప్రతి లబ్ధిదారునికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రారంభ గ్రాంట్ రూ. 10,000, తదుపరి దశలలో రూ. 2 లక్షల వరకు అదనపు ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉందివ్యవసాయంపశుపోషణహస్తకళలుటైలరింగ్నేత,  ఇతర చిన్న తరహా సంస్థలతో సహా తమకు నచ్చిన రంగాలలో లబ్దిదారులు ఈ సహాయాన్ని ఉపయోగించవచ్చు.

ఈ పథకం సామాజిక ఆధారితంగా అమలవుతుందిఆర్థిక సహాయంతో పాటుస్వయం సహాయ సంఘాలకు అనుబంధంగా ఉన్న కమ్యూనిటీ రిసోర్స్ సిబ్బంది వారికి శిక్షణ అందించి వారి ప్రయత్నానికి తోడ్పడతారువారి ఉత్పత్తుల విక్రయానికి మద్దతు ఇవ్వడానికి రాష్ట్రంలో గ్రామీణ హట్ బజార్లను మరింత అభివృద్ధి చేస్తారు.

ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన ప్రారంభోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగాజిల్లామండలక్లస్టర్గ్రామ స్థాయుల్లో నిర్వహిస్తారుఈ కార్యక్రమాన్ని కోటి మందికి పైగా మహిళలు వీక్షిస్తారు.

 

***