పిఎంఇండియా

భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 296 కిలో మీటర్ల పొడుగుతో కూడివుండే బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే కు చిత్రకూట్ లో ఈ రోజు న పునాది రాయి ని వేశారు. 2018వ సంవత్సరం ఫిబ్రవరి లో ప్రకటించిన ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడోర్ తాలూకు నోడ్స్ కు అదనం గా ఈ చర్య ను చేపట్టారు. 14,849 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణమయ్యే ఈ ఎక్స్ ప్రెస్ వే తో చిత్రకూట్, బాందా, మహోబా, హమీర్ పుర్, జాలౌన్, ఔరైయా మరియు ఇటావా జిల్లాల కు లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నారు. ఇదే కార్యక్రమం లో భాగం గా 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ ను కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా, పిఎమ్- కిసాన్ స్కీము లో భాగం గా లాభితులు అందరికీ కిసాన్ క్రెడిట్ కార్డు (కెసిసి)లను వితరణ చేసేందుకు ఉద్దేశించిన ఒక కార్యక్రమాన్ని సైతం ఆయన ప్రారంభించారు.
దేశం లో ఉపాధి కల్పన కై అనేక కార్యక్రమాల ను చేపడుతున్న ప్రభుత్వాన్ని శ్రీ మోదీ మెచ్చుకొంటూ, బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే లేదా ప్రతిపాదిత గంగా ఎక్స్ ప్రెస్ వే యుపి లో సంధానాన్ని అధికం చేయడం ఒక్కటే కాకుండా అనేక ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పిస్తాయని, మరి అలాగే పెద్ద నగరాల లో అందుబాటులో ఉండేటటువంటి సదుపాయాల ను ప్రజల కు కల్పిస్తాయని కూడా వివరించారు.
భూతల వ్యవస్థ లు, నౌక లు మరియు జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, హెలీకాప్టర్ లు, ఆయుధాలు మరియు సెన్సర్ ల వరకు పలు రకాల భారీ రక్షణ పరికరాల ఆవశ్యకతల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ సంవత్సరం బడ్జెటు లో యుపి డిఫెన్స్ కారిడోర్ కోసం 3700 కోట్ల రూపాయలు కేటాయించడమైందన్నారు. బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే తో యుపి డిఫెన్స్ కారిడోర్ తాలూకు పనుల లో ఒక కదలిక వస్తుంది అని కూడా ఆయన అన్నారు.
దేశం లో రైతుల ఆదాయాన్ని అధికం చేయడం మరియు వారికి సాధికారిత ను కల్పించడం కోసం 10,000 ఎఫ్పిఒ స్ ను నెలకొల్పే ఒక పథకాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకు ఒక ఉత్పత్తిదారు గా ఉన్న రైతు ఎఫ్పిఒ స్ ద్వారా వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తాడు అంటూ ప్రధాన మంత్రి అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల ను గురించి ఆయన చెప్తూ, ప్రభుత్వం రైతు కు ఆందోళన ను కలిగిస్తున్న ప్రతి ఒక్క అంశం పైనా.. అవి ఎంఎస్పి లు కావచ్చు, సాయిల్ హెల్త్ కార్డు కావచ్చు, యూరియా కు 100 శాతం వేప పూత కావచ్చు, దశాబ్దాల తరబడి అసంపూర్తి గా నిలచిపోయిన సాగు నీటి పారుదల పథకాల ను పూర్తి చేయడం కావచ్చు.. ప్రభుత్వం కసరత్తు చేసిందని ప్రధాన మంత్రి అన్నారు.
ఎఫ్పిఒ స్ రైతు ల కృషి ని సమష్టీకరించడం లో తోడ్పాటు ను అందిస్తాయని, దీని ద్వారా వారు వారి యొక్క దిగుబడుల ను ఒక ఉత్తమమైన ధర కు విక్రయించ గలుగుతారని ప్రధాన మంత్రి అన్నారు. అదే విధం గా, దేశం లోని 100 కు పైగా ఆకాంక్షభరిత జిల్లాల లోని ఎఫ్పిఒ స్ కు మరిన్ని ప్రోత్సాహకాల ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. దేశం లోని ‘ఆకాంక్షభరిత జిల్లాల’లో ప్రతి ఒక్క బ్లాకు లో కనీసం ఒక ఎఫ్పిఒ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
యావత్తు ఉత్తర్ ప్రదేశ్ లో చిత్రకూట్ సహా సుమారు 2 కోట్ల రైతు కుటుంబాలు ఒక సంవత్సరం లో 12 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాని కి హక్కు కలిగిన వారు అవుతున్నారని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ సొమ్ము ను వారి యొక్క బ్యాంకు ఖాతాల లో నేరు గా జమ చేయడం జరుగుతోందన్నారు. ఇందులో మధ్యవర్తుల ప్రమేయం గాని, ఎటువంటి వివక్ష కు తావు గాని లేదు అని పేర్కొన్నారు. బుందేల్ ఖండ్ పేరు తో, రైతుల పేరు తో వేల కోట్ల విలువైన ప్యాకేజీల ను ప్రకటించినప్పటికినీ అటువంటిది ఏమీ రైతు జేబు లోకి ఏమీ రాని కాలాల తో ఈ అంశాన్ని ఆయన పోల్చారు. పిఎమ్ కిసాన్ యోజన లబ్ధిదారుల ను పిఎమ్ జీవన్ జ్యోతీ బీమా తో, పిఎమ్ జీవన్ సురక్ష బీమా పథకం తో కూడా ముడిపెడుతున్నట్లు ఆయన వివరించారు. ‘‘దీని ద్వారా రైతుల కు కష్టకాలం లో 2 లక్షల రూపాయల వరకు బీమా సొమ్ము అందేందుకు అవకాశం ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.
రైతు యొక్క ఆదాయాన్ని అధికం చేయడం కోసం ఒక 16 అంశాల కార్యక్రమాన్ని రూపొందించినట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. రైతు కు అతడి పొలాని కి కొన్ని కిలో మీటర్ల దూరం లోపల ఒక గ్రామీణ బజారు సౌకర్యాన్ని కల్పించేందుకు వీలు గా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని, ఈ బజారు అతడి ని దేశం లోని ఏ విపణి కి అయినా జోడిస్తుందంటూ ప్రధాన మంత్రి వివరించారు. ఈ గ్రామీణ అంగళ్ళు రానున్న కాలాల్లో వ్యావసాయిక ఆర్థిక వ్యవస్థ తాలూకు నూతన కేంద్రాలు గా మారుతాయి అని ఆయన అన్నారు.
बुंदेलखंड को विकास के एक्सप्रेसवे पर ले जाने वाला, 'बुंदेलखंड एक्सप्रेसवे' इस पूरे क्षेत्र के जनजीवन को बदलने वाला सिद्ध होगा। pic.twitter.com/NKBYWK0UVT
— Narendra Modi (@narendramodi) February 29, 2020
हमारे देश में किसानों से जुड़ी जो नीतियां थीं, उन्हें हमारी सरकार ने निरंतर नई दिशा दी है... pic.twitter.com/T0JO8IF301
— Narendra Modi (@narendramodi) February 29, 2020
हाल ही में किसानों के कल्याण के लिए कई महत्वपूर्ण फैसले लिए गए हैं। pic.twitter.com/PP5BOBI2Jn
— Narendra Modi (@narendramodi) February 29, 2020
समूह से शक्ति मिलती है और इसी सामूहिक शक्ति से किसान भी समृद्धि की ओर अग्रसर होंगे। किसानों को उचित दाम दिलाने के लिए अब किसानों की सामूहिक ताकत का उपयोग किया जाएगा। pic.twitter.com/9mLH0gea2k
— Narendra Modi (@narendramodi) February 29, 2020
करीब 15 हज़ार करोड़ रुपए की लागत से बनने वाला ये बुंदेलखंड एक्सप्रेस-वे यहां रोज़गार के हजारों अवसर तैयार करेगा और यहां के सामान्य जन को बड़े-बड़े शहरों जैसी सुविधा से जोड़ेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 29, 2020
थोड़ी देर पहले ही यहां देश के किसानों की आय बढ़ाने के लिए, किसानों को सशक्त करने के लिए 10 हज़ार FPO यानि किसान उत्पादक संगठन बनाने की योजना भी लॉन्च की गई है।
— PMO India (@PMOIndia) February 29, 2020
यानि किसान अब तक उत्पादक तो था ही, अब वो FPO के माध्यम से व्यापार भी करेगा: PM @narendramodi
चित्रकूट सहित पूरे यूपी के 2 करोड़ से ज्यादा किसान परिवारों के खाते में भी करीब 12 हज़ार करोड़ रुपए जमा हुए हैं।
— PMO India (@PMOIndia) February 29, 2020
आप कल्पना कर सकते हैं, 12 हज़ार करोड रुपए, सिर्फ एक वर्ष में। वो भी सीधे बैंक खाते में, बिना बिचौलिए के, बिना किसी भेदभाव के: PM @narendramodi
जो साथी पीएम किसान योजना के लाभार्थी हैं, उनको पीएम जीवन ज्योति बीमा और पीएम जीवन सुरक्षा बीमा योजना से भी जोड़ा जा रहा है।
— PMO India (@PMOIndia) February 29, 2020
इससे किसान साथियों को मुश्किल समय में 2 लाख रुपए तक की बीमा राशि सुनिश्चित हो जाएगी: PM @narendramodi
समूह से शक्ति मिलती है और इसी सामूहिक शक्ति से किसान भी समृद्धि की ओर अग्रसर होंगे। किसानों को उचित दाम दिलाने के लिए अब किसानों की सामूहिक ताकत का उपयोग किया जाएगा।
— PMO India (@PMOIndia) February 29, 2020
आज चित्रकूट में जो नए FPO की शुरुआत हुई है, उसके पीछे भी यही भावना है: PM @narendramodi
सरकार ने ये भी तय किया है कि आदिवासी क्षेत्रों और चित्रकूट जैसे देश के 100 से ज्यादा Aspirational Districts- 'आकांक्षी जिलों' में FPOs को अधिक प्रोत्साहन दिया जाए, हर ब्लॉक में कम से कम एक FPO का गठन जरूर किया जाए: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 29, 2020
बुंदेलखंड एक्सप्रेस-वे हो, पूर्वांचल एक्सप्रेस-वे हो या फिर प्रस्तावित गंगा एक्सप्रेस-वे, ये यूपी में कनेक्टिविटी तो बढ़ाएंगे ही, रोज़गार के भी अनेक अवसर तैयार करने वाले हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 29, 2020
इस साल के बजट में यूपी डिफेंस कॉरिडोर के लिए 3700 करोड़ रुपए का प्रावधान किया गया है।
— PMO India (@PMOIndia) February 29, 2020
इन दोनों योजनाओं का आपस में गहरा नाता है। बुंदेलखंड एक्सप्रेसवे से यूपी डिफेंस कॉरिडोर को भी गति मिलने वाली है: PM @narendramodi