Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బుద్ధ పూర్ణిమ నాడు ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మంగళప్రదమైన బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ప్రధాన మంత్రి తన సందేశంలో-

‘‘ప్రతి ఒక్కరికీ బుద్ధ పూర్ణిమ అభినందనలు. ఈ రోజు మనం గౌతమ బుద్ధుడి మార్గదర్శక ఆదర్శాలను స్మరించుకొంటాం. ఆయన ఉత్తమ ఆలోచనలు తరాల తరబడి మార్గదర్శకత్వాన్ని అందిస్తూ ఉంటాయి.

సామరస్యంతో కూడిన, నిష్పాక్షికమైన మరియు కరుణామయమైన సమాజాన్ని నెలకొల్పే దిశగా కృషి చేయడానికి మనకు గౌతమ బుద్ధుడు ప్రేరణను అందిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.