పిఎంఇండియా
బేనామీ లావాదేవీల (నిషేధం) సవరణ బిల్లు, 2015 లో సవరణలను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
బిల్లు చట్ట రూపం దాల్చాక ఇందులోని నిబంధనలను అమలు చేయడంలో తలెత్తగల ఇబ్బందులను అధిగమించగలిగేందుకు బిల్లును చట్టపరంగాను, పరిపాలన ప్రక్రియ పరంగాను బలోపేతం చేసేందుకు ఈ సవరణలను ఉద్దేశించారు.
బేనామీ లావాదేవీలను కట్టుదిట్టంగా నిషేధించడం, అసమంజసమైన పద్ధతుల ద్వారా చట్టం నుంచి తప్పించుకోవడాన్ని నిరోధించడం కూడా ఈ చట్టం ఉద్దేశాలే. బేనామీ ఆస్తిని తగిన కార్యసరళిని అవలంబిస్తూ జప్తు చేసుకొనేందుకు ప్రభుత్వానికి అధికారాలను ఈ చట్టం దత్తం చేస్తుంది. ఈ కారణంతో పౌరులందరిలోను సమానత్వాన్ని ఈ చట్టం పెంపొందిస్తుంది. అయితే, ఆదాయ వెల్లడి పథకం లో భాగంగా బేనామీ ఆస్తులను వెల్లడి చేసే వారు బేనామీ చట్టం నుండి మినహాయింపును పొందగలుగుతారు.