పిఎంఇండియా
భారత్ లో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
శ్రీ సెర్జియో గోర్ పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ ని కలవటం సంతోషంగా ఉంది. ఆయన పదవీకాలంలో భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని నాకు నమ్మకం ఉంది’’.
Glad to receive Mr. Sergio Gor, Ambassador-designate of the US to India. I’m confident that his tenure will further strengthen the India–US Comprehensive Global Strategic Partnership.@SergioGor pic.twitter.com/WSzsPxrJXv
— Narendra Modi (@narendramodi) October 11, 2025