పిఎంఇండియా
భారత్–స్వీడన్ ద్వైైపాక్షిక సహకారంలో నూతన శకానికి రూపకల్పన చేస్తున్న అంశంపై స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్తో సంయుక్తంగా ఓ వ్యాసాన్ని రాసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు.
పర్యావరణహిత మార్పు నుంచి బలమైన సరఫరా వ్యవస్థల వరకు ఆవిష్కరణలు, సుస్థిరత, ఇరుదేశాల ప్రజల సంక్షేమం వంటి అంశాల ఆధారంగా భారత్–స్వీడన్ భాగస్వామ్యం దృఢంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్తో కలిసి రాసిన ఉమ్మడి వ్యాసంలో భారత్, స్వీడన్ దేశాల నూతన సహకార శకానికి ఎలా నాంది పలుకుతున్నదీ తెలిపారు. పర్యావరణహిత మార్పు నుంచి సరఫరా వ్యవస్థల బలోపేతం వరకు ఆవిష్కరణలు, సుస్థిరత, ఇరుదేశాల ప్రజల సంక్షేమం వంటి లక్ష్యాలతో భారత్–స్వీడన్ భాగస్వామ్యం ముందుకు సాగుతోంది“
***
In an op-ed with PM Ulf Kristersson, reflected on how India and Sweden are shaping a new era of cooperation. From green transition to supply chains, the India-Sweden partnership is guided by innovation, sustainability and shared prosperity for the people of our nations.…
— Narendra Modi (@narendramodi) May 20, 2026