పిఎంఇండియా
భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకూ, పెంపొందించేందుకూ మొదలుపెట్టిన ప్రయత్నాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. సరికొత్త ఉత్సాహంతో భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షిస్తూ, పండుగ చేసుకుంటూ, ముందుకు తీసుకుపోతున్నట్లు ఆయన తెలిపారు.
‘విరాసత్ భీ, వికాస్ భీ’ (వారసత్వంతో పాటు అభివృద్ధి కూడా) దృష్టికోణం నుంచి స్ఫూర్తిని పొంది ప్రాచీన కళాకృతులనూ, అవశేషాలనూ మన దేశానికి తిరిగి తీసుకురావడం మొదలు ఆధ్యాత్మిక, తీర్థయాత్రా సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనను పటిష్ఠపరచడం వరకూ చేస్తున్న అనేక ప్రయత్నాలు ప్రజలను భారత శాశ్వత సంప్రదాయాలతో తిరిగి అనుసంధానిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘సరికొత్త ఉత్సాహంతో భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షిస్తూ, పండుగ చేసుకుంటూ, ముందుకు తీసుకుపోతున్నాం.
‘విరాసత్ భీ, వికాస్ భీ’ (వారసత్వంతో పాటు అభివృద్ధి కూడా) దృష్టికోణం నుంచి స్ఫూర్తిని పొంది ప్రాచీన కళాకృతులనూ, అవశేషాలనూ మన దేశానికి తిరిగి తీసుకురావడం మొదలు ఆధ్యాత్మిక, తీర్థయాత్రా సంబంధించిన మౌలిక సదుపాయాలను పటిష్ఠపరచడం వరకూ చేస్తున్న అనేక ప్రయత్నాలు ప్రజలను భారత శాశ్వత సంప్రదాయాలతో తిరిగి అనుసంధానిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
***
India’s cultural heritage is being preserved, celebrated and carried forward with renewed vigour.
— Narendra Modi (@narendramodi) June 18, 2026
Guided by the vision of ‘Virasat Bhi, Vikas Bhi’, efforts ranging from the repatriation of antiquities to strengthening spiritual and pilgrimage infrastructure are reconnecting… https://t.co/E2Oe8RBeKU