పిఎంఇండియా
భారతదేశం మరియు ఈక్వటోరియల్ గినియా ల మధ్య ఔషధ సంబంధ మొక్కల రంగంలో సహకారానికి ఉద్దేశించినటువంటి అవగాహన పూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
పరిశోధన, శిక్షణ కోర్సులు, సమావేశాలు మరియు నిపుణుల డిప్యుటేషన్ కు అవసరమయ్యే ఆర్థిక వనరులను ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధీనం లోని నేశనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు కు కేటాయించిన బడ్జెటు మరియు ఇప్పటికే అమలవుతున్నటువంటి ప్రణాళికా పథకాల నుండి వెచ్చించడం జరుగుతుంది.
***