Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


నేడు మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని సోదరసోదరీలకు నా శుభాకాంక్షలు. సామాజిక చైతన్యం, సాంస్కృతిక వైభవం, వివిధ రంగాల్లో నాయకత్వానికి మహారాష్ట్రకు సుదీర్ఘ చరిత్ర ఉంది. సాహిత్యం, నాటక రంగం, సంగీతం, సినిమా నుంచి పరిశ్రమలు, విద్య, విజ్ఞాన శాస్త్రం,  ప్రజా సేవ వరకు… దేశ వృద్ధికి ఈ రాష్ట్రం చెరగని సహకారాన్ని అందించింది. మహారాష్ట్ర నిరంతర అభివృద్ధి కోసం, అక్కడి గొప్ప ప్రజల సంక్షేమం కోసం నేను ప్రార్థిస్తున్నాను.’’