Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 100వ వసంతంలోకి


దేశ సేవకు అంకితమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఈ రోజు 100వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

శ్రీ మోహన్ భగవత్ వీడియో లింక్ ను షేర్ చేస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు.

 

“దేశసేవకు అంకితమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేడు శత వసంతంలోకి అడుగుపెడుతోంది. నిరంతర యాత్రలో ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకున్న సందర్భంగా స్వయం సేవకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అనంతమైన శుభాకాంక్షలు. భారతి మాత కోసం ఈ సంకల్పం, అంకిత భావం దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తుంది. ‘అభివృద్ధి చెందిన భారతదేశాన్ని’ సాకారం చేయడంలో కొత్త శక్తిని నింపుతుంది. నేడు విజయదశమి పర్వదినం సందర్భంగా మాన్యవర్ సర్‌ సంఘ్ చాలక్ శ్రీ మోహన్ భగవత్ గారి ప్రసంగం తప్పనిసరిగా వినాల్సిందిగా సూచిస్తున్నాను

…”