పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు వారణాసి, లక్నో లకు వెళ్లనున్నారు.
ప్రధాని వారణాసికి చేరుకొని, అక్కడ దివ్యాంగజన సశక్తీకరణ సమారోహ్ కు హాజరవుతారు. ఈ కార్యక్రమం దివ్యాంగ వ్యక్తులకు సహాయపడే పరికరాల పంపిణీ కోసం ఏర్పాటు చేయబడింది.
లక్నో లో ప్రధాని బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తారు. భారతీయ మైక్రో క్రెడిట్ ఆధ్వర్యంలో ఇ-రిక్షాల పంపిణీ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు అవుతారు. అంబేద్కర్ మహాసభ లో బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ కు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటిస్తారు.