Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రైతుల సంక్షేమం, సాధికారత కల్పనపై వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

గత 12 సంవత్సరాల్లో రైతుల సంక్షేమానికీవారికి సాధికారతను కల్పించడానికి చేపట్టిన అపూర్వ కృషిని ఆ వ్యాసం ముఖ్యంగా ప్రస్తావించిందిఅన్నదాతలను దృష్టిలో పెట్టుకొని అమలుచేసిన వివిధ కార్యక్రమాలు వారి జీవితాల్లో చెప్పుకోదగ్గ సానుకూల మార్పులను తీసుకువచ్చాయని ఆ వ్యాసం పేర్కొనడంతో పాటు వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్న తీరును కూడా వివరించింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘
రైతు సోదరీసోదరుల సంక్షేమంతో పాటు వారికి సాధికారతను కల్పించే దిశగా ఇదివరకెన్నడూ ఎరుగని కార్యక్రమాలను గత 12 సంవత్సరాల్లో అమలుచేశారుఅన్నదాతల కోసం మేం తీసుకువచ్చిన పథకాలతో వారి జీవితాల్లో అనేక సకారాత్మక మార్పులు వచ్చాయివ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న ఈ పెనుమార్పులను గురించి  కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ గారు తాను రాసిన ఒక వ్యాసంలో సమగ్రంగా వివరించారు’’ అని తెలిపింది.

***