పిఎంఇండియా
రష్యా ఉప ప్రధాని దిమిత్రి రోగొజిన్కు మంగళవారం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానం పలికారు. రష్యాతో ఉన్న వ్యూహాత్మకమైన, ప్రత్యేకమైన భాగస్వామ్యానికి భారతదేశం అత్యంత అధిక ప్రాధాన్యం కట్టబెట్టిన సంగతిని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. త్వరలోనే అధ్యక్షుడు పుతిన్తో నిర్మాణాత్మకమైన, చారిత్రకమైన వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం రష్యాలో పర్యటించేందుకు తాను ఎదురుచూస్తున్నానని కూడా ప్రధాని తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాలను శిఖరాగ్ర సమావేశం ఒక సరికొత్త ఉన్నత స్థాయికి చేర్చగలదన్నవిశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు.