పిఎంఇండియా
‘వికాస్ భీ, విరాసత్ భీ’ (అభివృద్ధి, వారసత్వం) అనే మంత్రాన్ని స్వీకరించడం వల్ల త్రిపుర ఎంత వేగంగా అభివృద్ధిని సాధించిందో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా తన ఇటీవలి త్రిపుర పర్యటన అనుభవాలను పంచుకుంటూ.. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులను, అక్కడి అపార అవకాశాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వివరించారు. ఈ పోస్టుకు ప్రధానమంత్రి స్పందించారు. త్రిపుర కేవలం మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిలోనే కాకుండా, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించుకోవడంలో, వేడుకగా జరుపుకోవడంలో కూడా ముందంజలో ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ లో ఇలా పేర్కొన్నారు:
“వికాస్ భీ, విరాసత్ భీ’ అనే మంత్రాన్ని పుణికిపుచ్చుకున్న త్రిపుర అభివృద్ధిలో వేగవంతమైన పురోగతిని సాధిస్తోంది. ప్రతిరోజూ కొత్త విజయాలను నమోదు చేస్తుంది. కేంద్రమంత్రి @JM_Scindia గారు తన త్రిపుర పర్యటన అనుభవాలను పంచుకుంటూ.. రాష్ట్రం మారుతున్న తీరును, అక్కడి అపార అవకాశాలను గురించి వివరంగా తెలియజేశారు. ఆయన రాసిన ఈ కథనాన్ని చదవండి’’
‘विकास भी, विरासत भी’ के मंत्र को आत्मसात करते हुए त्रिपुरा विकास की तेज रफ्तार पकड़ चुका है और हर दिन नई-नई उपलब्धियां दर्ज कर रहा है। केंद्रीय मंत्री @JM_Scindia जी ने त्रिपुरा प्रवास के अपने अनुभवों को साझा करते हुए राज्य की बदलती तस्वीर और अपार संभावनाओं के बारे में विस्तार… https://t.co/Zo8qIz66Fd
— PMO India (@PMOIndia) February 3, 2026