పిఎంఇండియా
వ్యాపార పరిష్కార సంబంధ సహకారం అంశం పై భారతదేశానికి, కొరియా కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందం పత్రానికి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.
కొరియా అధ్యక్షుడు 2018 జులై నెల లో భారతదేశం లో ఆధికారిక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఈ ఎంఒయు పై సంతకాలు జరిగాయి.
ఉభయ దేశాల యాంటి- డంపింగ్, సబ్సిడీ, కౌంటర్ వేలింగ్ మరియు రక్షణాత్మక చర్యలు తదితర వ్యాపార సంబంధిత పరిష్కారాల రంగం లో సహకారాన్ని ఈ ఎంఒయు ప్రోత్సహించనుంది. తద్వారా ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు పెంపొందుతాయి.
**