Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్యూహాత్మక, నూతన రంగాల్లో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రీసెర్చి డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ (ఆర్డీఐ) పథకానికి క్యాబినెట్ ఆమోదం


భారత్‌లో పరిశోధనఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చేసే ప్రయత్నాల్లో భాగంగా.. రూ.1 లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌తో రీసెర్చి డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ (ఆర్డీఐపథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలోపరిశోధనను వాణిజ్యీకరించడంలో ప్రైవేటు రంగం పోషిస్తున్న కీలకపాత్రను గుర్తిస్తూ.. ఆర్డీఐలో ప్రైవేటు రంగం పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ లేదా సున్నా వడ్డీ రేట్లతో దీర్ఘకాల వ్యవధిలో ఫైనాన్సింగ్రీఫైనాన్సింగ్‌ను అందించడమే ఆర్డీఐ పథకం లక్ష్యంనిధుల సమీకరణలో ప్రైవేటు రంగం ఎదుర్కొంటున్న అవరోధాలుసవాళ్లను అధిగమించడానికి ఇది తోడ్పడుతుందిఅలాగే నూతనవ్యూహాత్మక రంగాల్లో ఆవిష్కరణలను సులభతరం చేయడానికిసాంకేతికత స్వీకరణను ప్రోత్సహించడానికిపోటీతత్వాన్ని పెంచడానికి వృద్ధిరిస్క్ క్యాపిటల్ అందించడమే ఈ పథకం లక్ష్యంగా నిర్దేశించుకుందిఈ పథకంలో ప్రధానాంశాలు:

నూతనంగా ఆవిర్భవిస్తున్న రంగాలతో పాటుఆర్థిక భద్రతవ్యూహాత్మక ప్రయోజనంస్వావలంబనకు సంబంధించిన ఇతర రంగాల్లో పరిశోధనఅభివృద్ధిఆవిష్కరణలను చేపట్టేలా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం.

బీఉన్నత సాంకేతిక సంసిద్ధత స్థాయులు (టీఆర్ఎల్వద్ద పరివర్తన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం.

సీకీలకమైనలేదా వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమున్న సాంకేతిక పరిజ్ఞానాలను పొందేందుకు తోడ్పాటు.

డీడీప్టెక్ అంకుర సంస్థలకు నిధులను సులభతరం చేయడం.

ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే అనుసంధాన్ నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్పాలకమండలి ఆర్డీఐ పథకానికి అవసరమైన విస్తృత వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుందిపథకం మార్గదర్శకాలను ఏఎన్ఆర్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీఆమోదిస్తుందిఅలాగే ద్వితీయ శ్రేణి ఫండ్ మేనేజర్లునూతన రంగాల్లో చేపట్టే ప్రాజెక్టుల పరిధివాటి రకాన్ని సిఫార్సు చేస్తుందికేబినెట్ కార్యదర్శి నాయకత్వంలోని కార్యదర్శుల సాధికారత బృందం (ఈజీవోఎస్పథకంలో చేసే మార్పులురంగాలుప్రాజెక్టుల రకాలను ఆమోదిస్తుందిఅలాగే ద్వితీయ శ్రేణి ఫండ్ మేనేజర్ల పనితీరుపథకం అమలు సమీక్షకు బాధ్యత వహిస్తుందిఆర్డీఐ పథకాన్ని అమలు చేయడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీనోడల్ విభాగంగా పనిచేస్తుంది.

ఆర్డీఐ పథకంలో రెండంచెల నిధుల విధానం ఉంటుందిమొదటి అంచెలో ఏఎన్ఆర్ఎఫ్ పరిధిలో ప్రత్యేక ప్రయోజన నిధి (ఎస్‌పీఎఫ్)ను ఏర్పాటు చేస్తారుఇది నిధులకు సంరక్షకురాలిగా వ్యవహరిస్తుందివివిధ ద్వితీయ శ్రేణి మేనేజర్లకు ఎస్‌పీఎఫ్ నుంచి నిధులు కేటాయిస్తారుఇది ప్రధానంగా దీర్ఘకాలిక రాయితీ రుణాల రూపంలో ఉంటుందిఆర్ఎండ్‌డీ ప్రాజెక్టులకు ద్వితీయ శ్రేణి ఫండ్ మేనేజర్లు ద్వారా ఆర్ఎండ్‌డీ ప్రాజెక్టులకు అందించే నిధులు తక్కువ వడ్డీ లేదా సున్నా వడ్డీ రేట్లతో దీర్ఘకాలిక రుణం రూపంలో ఉంటాయిఈక్విటీ రూపంలో సైతం ఈ రుణాలను ముఖ్యంగా అంకుర సంస్థలకు అందించవచ్చుడీప్ టెక్ అంకుర సంస్థలకు నిధులు (ఎఫ్ఓఎఫ్), లేదా ఆర్డీఐకు ఉద్దేశించిన ఇతర ఎఫ్ఓఎఫ్‌ సహకారాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రైవేటు రంగంలో దీర్ఘకాలఅందుబాటులో ఉండే రుణాల కీలక అవసరాన్ని గుర్తించి పరిష్కారం చూపించడం ద్వారా ఆర్డీఐ పథకం స్వావలంబనఅంతర్జాతీయ పోటీ తత్వాన్ని పెంపొందిస్తుందితద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా చేస్తున్న ప్రయాణంలో దేశానికి అనుకూలమైన ఆవిష్కరణల వ్యవస్థను సులభతరం చేస్తుంది.

 

***