పిఎంఇండియా
సత్యానికి కట్టుబడి ఉంటే సంపద, నిస్వార్థంగా సేవలను అందిస్తే కీర్తి, నిరంతర అభ్యాసం ద్వారా జ్ఞానం, కర్మలతో వివేకం లభిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సుగుణాలు మనిషి స్వభావాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషించడంతో పాటు, సమాజ పురోగతిలో కూడా కీలక పాత్రను పోషిస్తాయని ఆయన తెలిపారు.
‘‘సత్యానుసారిణీ లక్ష్మీః కీర్తిసత్యాగానుసారిణీ అభ్యాససారిణీ విద్యా బుద్ధిః కర్మానుసారిణీ’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశంలో పేర్కొన్నారు.
सत्यानुसारिणी लक्ष्मीः कीर्तिस्त्यागानुसारिणी।
— Narendra Modi (@narendramodi) June 18, 2026
अभ्याससारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी।। pic.twitter.com/43pQrC1QMP