Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సాంస్కృతిక బంధాల బలోపేతం.. ఒకే భారత్-శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి పెంపులో కాశీ తమిళ సంగమం ప్రగతిపై తన ఆలోచనలను ప్రజలతో పంచుకున్న ప్రధాని


కాశీ తమిళ సంగమం సాధించిన ప్రగతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనలను పొంగల్ పర్వదినం సందర్భంగా ప్రజలతో పంచుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే వైవిధ్య భారతంలో సంప్రదాయాలు, భాషలు, సమాజాలను ఏకం చేసే ఈ కార్యక్రమం సాంస్కృతిక ఆదానప్రదానానికి ఒక శక్తిమంతమైన వేదికగా మారిన తీరును ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

#సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా సోమనాథ ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి, కాశీ, సౌరాష్ట్ర తమిళ సంగమం వంటి కార్యక్రమాలపై అక్కడి పౌరులను ప్రశంసిస్తూ వారితో ముచ్చటించారు.

దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా వేర్వేరు భాషల్లో పంపిన సందేశాల్లో:

““#సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా సోమనాథ్‌ను సందర్శించినప్పుడు, పొంగల్ పర్వదినం సందర్భంగా కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర తమిళ సంగమం నిర్వహించిన ప్రశంసనీయ కార్యక్రమాలపై అక్కడి ప్రజలను నేను కలిశాను. కాశీ తమిళ సంగమం పురోగమనం, ‘ఒకే భారత్-శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని అది బలోపేతం చేసిన తీరుపై నా ఆలోచనలను వారితో పంచుకున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***