పిఎంఇండియా
సోమనాథ్ అమృత్ మహోత్సవంలో తన ప్రసంగంలోని విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు. ఈ మహోత్సవం కేవలం గతాన్ని స్మరించుకునే వేడుక మాత్రమే కాదని, రాబోయే వెయ్యి సంవత్సరాల పాటు దేశానికి స్ఫూర్తినిచ్చే పండుగ కూడా అని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘సోమనాథ్ అమృత్ మహోత్సవం కేవలం గతాన్ని స్మరించుకునే ఉత్సవం మాత్రమే కాదు. రాబోయే వెయ్యి సంవత్సరాల వరకు దేశానికి స్ఫూర్తినిచ్చే పండుగ కూడా’’
‘‘1998లో పోఖ్రాన్ అణు పరీక్షలతో దేశ శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించింది. ఆ తర్వాత ప్రతి సంక్షోభాన్ని భారత్ ఎంతటి దృఢత్వంతో ఎదిరించిందో చూసి ప్రపంచమే విస్మయానికి గురైంది’’
‘‘సర్దార్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కేఎం మున్షీ సహా మన దేశంలో ఎందరో గొప్ప మహానుభావులు సోమనాథ్ సేవలో తమ సర్వస్వాన్ని అర్పించారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్లడానికి వారి స్మృతులు మనకు స్పూర్తినిస్తాయి’’
“మన సాంస్కృతిక కేంద్రాలు వేల సంవత్సరాలుగా దేశానికి గుర్తింపుగా నిలిచాయి. కానీ దురదృష్టవశాత్తూ సోమనాథ్ వంటి ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కంటే స్వార్థ రాజకీయాలకు విలువనిచ్చే వ్యక్తులు నేటికీ దేశంలో ఉన్నారు’’
‘‘దేశవ్యాప్తంగా ఉన్న పవిత్ర తీర్థక్షేత్రాలను అభివృద్ధి చేసే భాగ్యం నాకు లభించింది. పవిత్రమైన సోమనాథ్ ఆలయ సముదాయం దీనికి ఒక శక్తిమంతమైన నిదర్శనం’’
‘‘75 ఏళ్ల క్రితం పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు దేశం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. నేడు ఆ ప్రయాణం మరింత విస్తృత రూపంలో మన ముందు ఉంది. దీనిని మనం కొత్త శిఖరాలకు చేర్చాలి’’
***
सोमनाथ अमृत महोत्सव केवल अतीत का उत्सव नहीं है। यह अगले एक हजार वर्षों के लिए भारत की प्रेरणा का महोत्सव भी है। pic.twitter.com/8Zyqp3CqwN
— Narendra Modi (@narendramodi) May 11, 2026
वर्ष 1998 में पोखरण में परमाणु परीक्षण के साथ दुनिया ने भारत के वैज्ञानिकों के सामर्थ्य को महसूस किया। इसके बाद देश ने हर तरह के संकट का जिस मजबूती से मुकाबला किया, उससे दुनिया भी हैरान रह गई। pic.twitter.com/l4FYmAr5Kp
— Narendra Modi (@narendramodi) May 11, 2026
सरदार पटेल, डॉ. राजेंद्र प्रसाद और के. एम. मुंशी जी सहित हमारे देश में ऐसी अनगिनत महान विभूतियां हुई हैं, जिन्होंने सोमनाथ की सेवा में सर्वस्व अर्पित कर दिया। उनका पुण्य स्मरण हमें प्रेरणा देता है कि हम भारतवासियों को अपनी सांस्कृतिक विरासत को निरंतर आगे बढ़ाना है। pic.twitter.com/8s9pKMU1F0
— Narendra Modi (@narendramodi) May 11, 2026
हमारे सांस्कृतिक स्थल हजारों वर्षों से भारत की पहचान रहे हैं। लेकिन दुर्भाग्य से देश में आज भी ऐसे लोग हैं, जिनके लिए सोमनाथ जैसे राष्ट्रीय स्वाभिमान के विषय से ज्यादा जरूरी तुष्टिकरण है। pic.twitter.com/5nkVL6lWrO
— Narendra Modi (@narendramodi) May 11, 2026
मुझे देशभर के पवित्र तीर्थों के विकास का सौभाग्य मिला है। पवित्र सोमनाथ परिसर भी इसका एक सशक्त उदाहरण है। pic.twitter.com/rmJ1aMJL0s
— Narendra Modi (@narendramodi) May 11, 2026
75 वर्ष पहले जब पुनर्निर्मित सोमनाथ मंदिर में प्राण-प्रतिष्ठा हुई, तब भारत ने एक नई यात्रा शुरू की। आज यह यात्रा और अधिक व्यापक स्वरूप में हमारे सामने है, जिसे हमें नई ऊंचाई पर लेकर जाना है। pic.twitter.com/446QkWrUfn
— Narendra Modi (@narendramodi) May 11, 2026