పిఎంఇండియా
హర్యానాలోని జింద్లో సుమారు రూ.14,700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు, జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతానికి రావడం పట్ల ప్రధానమంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శక్తి పీఠం మాతా జయంతి ఆశీస్సులు పొందిన ఈ ప్రాంతానికి ఉన్న గొప్ప చారిత్రక, సైనిక, ఆధ్యాత్మిక వారసత్వం గురించి వివరించారు. దశాబ్దాల క్రితం సంస్థాగత కార్యక్రమాల నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు లభించిన ఆప్యాయతను, ముర్రా గేదె పాలు, దేశీ బురా, ఘేవార్ లాంటి స్థానిక వంటకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘ఇది సాధారణ ప్రదేశం కాదు. ఇది చరిత్ర, ధైర్యం, మతం, అపారమైన గర్వానికి ప్రతీకగా నిలిచే భూమి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ ప్రాంతం నాటకీయంగా సంతరించుకున్న అభివృద్ధిని ఇక్కడి స్థానిక రుచులతో ప్రధానమంత్రి పోల్చారు. ఈ నగరాన్ని సుపరిపాలనకు గొప్ప నమూనాగా అభివర్ణించారు. గడచిన కొన్నేళ్లుగా ఈ రాష్ట్రం సరికొత్త ప్రగతి పథంలో స్థిరంగా ప్రయాణిస్తోందన్నారు. ఈ లక్ష్యాన్ని… ఈ రోజు చేపట్టిన కార్యక్రమాలు మరింత శక్తిమంతం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ‘‘ప్రభుత్వం నిర్దేశించుకున్న కచ్చితమైన లక్ష్యానికి ఈ నాటి కార్యక్రమం నూతనోత్తేజాన్ని అందిస్తోంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఇకపై ఈ ప్రాంతం పేరు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోనుందని, దేశంలోని తొలి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభమైందని ప్రధానమంత్రి గర్వంగా ప్రకటించారు. చరిత్రాత్మకంగా నిలిచిపోయిన బొంబాయి, థానేల మధ్య తొలి రైలు ప్రయాణం మాదిరిగానే ఆధునికమైన, పర్యావరణహితమైన రవాణా గురించి చర్చ జరిగిన ప్రతిసారి భవిష్యత్తు తరాలు ఈ కారిడార్ను కూడా గుర్తు చేసుకుంటాయని ఆయన అన్నారు. ‘‘భారతీయ రైల్వేల్లో ఆధునికీకరణకు సంబంధించిన ఈ చరిత్రాత్మక విజయానికి గాను మీ అందరికీ, యావత్ దేశానికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని శ్రీ మోదీ చెప్పారు.
భారీ మౌలిక సదుపాయాల కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రధానమంత్రి వివరించారు. రాష్ట్ర సంక్షేమంతో ప్రత్యక్షంగా ముడిపడిన రైల్వేలు, జాతీయ రహదారులు, సాంస్కృతిక వారసత్వానికి చెందిన దాదాపు రూ.14,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల గురించి ప్రధాని వెల్లడించారు. ఆరోగ్య సేవల రంగంలో భారీ స్థాయిలో చేపట్టిన విస్తరణ కార్యక్రమాల గురించి తెలియజేస్తూ.. భివానీలో పండిట్ నేకి రామ్ శర్మ వైద్య కళాశాలను, నార్నౌల్లో మహర్షి చ్యవన్ వైద్య కళాశాల, తులారాం ఆసుపత్రిని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. వైద్య నిపుణులుగా మారాలనే లక్ష్యంతో ఉన్నవారికి అవకాశాలను కల్పించడమే వీటి లక్ష్యం. ‘‘ఈ కొత్త సంస్థలు హర్యానాలో వైద్య సేవలను బలోపేతం చేసి, అందరికీ అందుబాటులోకి తీసుకువస్తాయి’’ అని శ్రీ మోదీ తెలిపారు.
స్థానిక ప్రజలు ప్రదర్శించిన పౌర బాధ్యతను ప్రధానమంత్రి అభినందించారు. తాను రావడానికంటే ముందే చేపట్టిన పరిశుభ్రతా స్వాగత కార్యక్రమంలో నిబద్ధతతో ప్రజలు పాల్గొన్న తీరును ఆయన కొనియాడారు. పారిశుద్ధ్య కార్యక్రమంలో సమాజం చురుగ్గా, ఉత్సాహంగా పాల్గొనడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కనబరిచిన ఈ స్ఫూర్తిని ఎల్లప్పుడూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ‘‘ఇదే పద్ధతిలో మన దైనందిన జీవితంలో కూడా పారిశుద్ధ్యాన్ని భాగంగా చేసుకోవాలి’’ అని శ్రీ మోదీ అన్నారు.
అంతర్జాతీయంగా రైల్వే రంగంలో వచ్చిన సాంకేతిక పరిణామ క్రమం గురించి వివరిస్తూ.. 19వ శతాబ్దం ఆవిరి యంత్రాలతో, 20వ శతాబ్దం విద్యుత్ శక్తితో ఎలా ప్రాథమికంగా నిర్వచితమయ్యాయో ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు గురించి తెలియజేస్తూ.. జింద్, సోనీపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో కొత్తగా ప్రారంభమైన హైడ్రోజన్ ఆధారిత రవాణాతో 21వ శతాబ్దం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ‘‘భవిష్యత్తులో విస్తరించేందుకు అపారమైన అవకాశాలున్న ఈ 21వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞానంలో భారతీయ రైల్వేలు ముందడుగు వేశాయి” అని శ్రీ మోదీ తెలియజేశారు.
దేశం సాధించిన ఈ విజయాన్ని అంతర్జాతీయ దృష్టికోణంలో ఉంచుతూ.. కేవలం ఏడెనిమిది ఏళ్ల క్రితమే ఈ సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చిందని ప్రధానమంత్రి తెలియజేశారు. ఇప్పుడు ప్రపంచంలో కేవలం కొన్ని ప్రత్యేకమైన దేశాలకు మాత్రమే ఇలాంటి రైళ్లను నడిపే సామర్థ్యం ఉందని, అవి కూడా ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఆయన వెల్లడించారు. ‘‘కొత్తగా ప్రారంభించిన ఈ భారతీయ హైడ్రోజన్ రైలుకున్న అసలైన నిజమైన సామర్థ్యాల గురించి వింటే మీరు ఎంతో గర్వపడతారు’’ అని శ్రీ మోదీ అన్నారు.
ఈ నూతన రవాణా అద్భుతానికి సంబంధించి సాంకేతిక వివరాలను ప్రధానమంత్రి వెల్లడించారు. కొత్తగా ప్రారంభించిన ఈ రైలును… ఈ విభాగంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా వర్ణించారు. ఇది 3,200 హార్స్పవర్ సామర్థ్యాన్నీ, పది కోచ్లనూ కలిగి ఉందని ఆయన తెలియజేశారు. సాధారణంగా మూడు, నాలుగు కోచ్లను మాత్రమే కలిగి ఉండే అంతర్జాతీయ రైళ్లతో దీనిని పోల్చారు. తొలి ప్రయత్నంలోనే మన దేశం సాధించిన ఈ సాహసోపేతమైన ఆధిపత్యాన్ని ఆయన గర్వంగా తెలియజేశారు. ‘‘మొత్తం పది పూర్తి స్థాయి కోచ్లతో కూడిన హైడ్రోజన్ రైలును నడపడం ద్వారా భారతదేశం తన సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించింది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
పర్యావరణహిత వాహన రంగంలో సాధించిన ఈ విజయానికి ఉన్న దేశీయ స్వభావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. పూర్తిగా పొగ రహితమైన ఈ రైలు దేశీయ తయారీ రంగంలో సాధించిన గొప్పదైన, సుస్పష్టమైన విజయమని ఆయన అన్నారు. ఈ అధునాతన వ్యవస్థను రూపొందించిన ప్రతిభావంతులైన స్వదేశీ ఇంజినీర్లకు, ఎలాంటి లోపాలు లేకుండా నిర్మించిన స్థానిక తయారీ సంస్థలకు ఆయన ఘనతను ఆపాదించారు. ‘‘ఇది ‘మేక్ ఇన్ ఇండియా‘ కార్యక్రమానికి అత్యంత విజయవంతమైన, గర్వించదగిన ఉదాహరణ’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ అత్యాధునిక సాంకేతికతకు సంబంధించిన ప్రత్యేక కార్యాచరణ అవసరాలను వివరిస్తూ... హైడ్రోజన్ రైళ్లకు పూర్తిగా భిన్నమైన మౌలిక సదుపాయాలు, ప్రత్యేకమైన సహాయక వ్యవస్థలు అవసరమని ప్రధానమంత్రి అన్నారు. ఈ నిర్దిష్ట అవసరాలను తీర్చటానికి త్వరలోనే నూతన కర్మాగారాలు, అనుబంధ సౌకర్యాలు ఏర్పాటవుతాయని అంచనా వేశారు. దీని ద్వారా స్థానికంగా పెద్దఎత్తున ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. “ఈ అత్యాధునిక రైల్వే వ్యవస్థ ద్వారా హర్యానా యువతకు తప్పకుండా నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
మారిన భౌగోళిక రాజకీయ సవాళ్లపై ప్రధానమంత్రి మాట్లాడారు. గత పన్నెండేళ్లలో భారతీయ రైల్వేలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల వ్యూహాత్మకంగా రవాణా ప్రయోజనాలు చేకూరినట్లు తెలిపారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతల గురించి వివరిస్తూ.. పెట్రోలియం, డీజిల్, ఎల్పీజీ, ఎరువుల సరఫరాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో కొన్ని నెలలుగా ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. “కీలకమైన ఈ సముద్ర మార్గం ద్వారానే భారత్, పెద్ద మొత్తంలో ఇంధనం, వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
2014 కంటే ముందు ఇలాంటి ప్రపంచ ఇంధన సంక్షోభం వచ్చి ఉంటే దేశంపై ఎంతటి తీవ్రమైన ప్రభావం ఉండేదో అని ఊహిస్తూ... గతంలో రైల్వే శాఖ డీజిల్ పైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల దేశీయ రైల్వే వ్యవస్థ ఖచ్చితంగా పూర్తిగా స్తంభించిపోయేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 1925 నుంచి 2014 మధ్య కాలంలో కేవలం 30 శాతం రైల్వే వ్యవస్థను విద్యుద్దీకరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ చొరవతో ఇప్పుడు జాతీయ గ్రిడ్లో దాదాపు 99 శాతం, రాష్ట్రంలోని ట్రాకులు 100 శాతం విద్యుద్దీకరణను పూర్తి చేసుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు. “ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం ఉన్నప్పటికీ రైల్వే వ్యవస్థలో పూర్తి విద్యుద్దీకరణ వల్లే మన రైళ్లు ఎలాంటి అంతరాయం లేకుండా నడిచాయి” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
మెరుగైన అనుసంధానం వల్ల కలిగే సామాజిక–ఆర్థిక ప్రయోజనాలను ప్రధానమంత్రి స్పష్టం చేశారు. విస్తృతమైన రహదారి, రైలు మార్గాలు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేస్తాయన్నారు. ఢిల్లీ–అమృత్సర్–కత్రా ఎక్స్ప్రెస్వే స్థానిక విభాగం, జింద్–గోహనా జాతీయ రహదారి, అంబాలా–కాలా అంబ్ నాలుగు లైన్ల ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభిస్తూ… వీటి ద్వారా రాష్ట్రాల మధ్య రవాణా మరింత సులభతరమవుతుందని ఆకాంక్షించారు. “ఇలాంటి విస్తృతమైన అనుసంధాన పనులు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు సమగ్రాభివృద్ధి వేగాన్ని పెంచుతాయి” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఆతిథ్య జిల్లా సాధించిన రవాణా రంగ పరివర్తనను వివరిస్తూ... ఈ నగరం ఇప్పుడు వ్యూహాత్మకంగా ఐదు వేర్వేరు జాతీయ రహదారులతో అనుసంధానమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ రహదారుల అభివృద్ధి వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను వివరిస్తూ... రైతులు, పశుపోషకులు ఇప్పుడు ప్రధాన వాణిజ్య మార్కెట్లకు అత్యంత తక్కువ ఖర్చుతో సులభంగా చేరుకోగలుగుతారని స్పష్టం చేశారు. “ఈ బలమైన రవాణా అనుసంధానత పరిశ్రమలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. పర్యాటక రంగానికి నూతనోత్తేజాన్ని ఇస్తుంది. భారీ స్థాయిలో నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఇటీవల జరిపిన విజయవంతమైన దౌత్య పర్యటనలను గుర్తుచేసుకుంటూ.. దేశం సాధించిన ముఖ్యమైన ద్వైపాక్షిక అంతర్జాతీయ ఒప్పందాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రాంతీయ యువతకు ప్రత్యక్షంగా ఎంతో ప్రాముఖ్యత ఉండి కూడా మీడియాలో పెద్దగా ప్రాధాన్యత దక్కని కీలకమైన వ్యూహాత్మక అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. “హర్యానా యువతతో ముడిపడి ఉండి కూడా అంతగా చర్చకు రాని ఒక అంశం… క్రీడలు” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
విదేశీ ప్రభుత్వాలతో జరిపిన వ్యూహాత్మక చర్చల గురించి ప్రధానమంత్రి వివరిస్తూ.. క్రీడలు, పోటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావటమే లక్ష్యంగా భవిష్యత్ అంతర్జాతీయ భాగస్వామ్యాలను వెల్లడించారు. క్రీడా పరిశ్రమ విస్తరణతో పాటు ఉన్నత శ్రేణి అథ్లెట్ల శిక్షణా పద్ధతులపై దృష్టి సారించే ఉమ్మడి కార్యక్రమాల ద్వారా స్థానిక నైపుణ్యాలు భారీగా మెరుగవుతాయని కాంక్షించారు. “ఈ దేశాలతో కలిసి పని చేయటం ద్వారా రాబోయే రోజుల్లో క్రీడా రంగంలో మనం గణనీయమైన పురోగతిని సాధిస్తాం” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
దేశీయ క్రీడా మౌలిక సదుపాయాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులను వివరిస్తూ...
క్రీడలను శారీరక దృఢత్వానికి, ఉపాధికి ప్రధానమైన, లాభదాయకమైన మార్గంగా.. క్రియాశీలకంగా, క్రమబద్ధంగా ఎలా మారుస్తున్నామో ప్రధానమంత్రి వివరించారు. నూతన జాతీయ క్రీడా విధానం, ఖేలో భారత్ నీతిల విజయవంతమైన అమలును ప్రస్తావిస్తూ.. ఖేలో ఇండియా, టాప్స్ వంటి అత్యంత ప్రభావవంతమైన పథకాల ద్వారా క్రీడాకారులకు లభించిన ఆర్థిక, సంస్థాగత మద్దతును ఆయన కొనియాడారు. “ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకు, అంకితభావం గల మన క్రీడాకారులకు అపారమైన, నిరంతర ప్రోత్సాహాన్ని అందిస్తోంది” అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.
యువ క్రీడాకారులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. మౌలిక సదుపాయాలు, రాబోయే ప్రతిష్ఠాత్మక ప్రపంచ క్రీడా పోటీల గురించి మాట్లాడారు. కామన్వెల్త్ గేమ్స్-2030కు ఆతిథ్యం ఇవ్వటానికి భారత్ సిద్ధమవుతోందని, ఒలింపిక్ గేమ్స్-2036 వేలం కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రయత్నిస్తోందన్నారు. వీటితో పాటు అహ్మదాబాద్లో వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ కూడా జరుగుతాయని ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక క్రీడాకారులు పూర్తి నిబద్ధతతో కఠిన శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు. “మీ కఠోర శిక్షణకు అవసరమైన ప్రతి సదుపాయాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కల్పిస్తుందని నేను హామీ ఇస్తున్నా” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
స్థానిక ప్రజలకు ప్రాధాన్యతనిచ్చే పాలనా విధానాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో సమ్మిళిత అభివృద్ధి సూత్రాన్ని కఠినంగా పాటిస్తున్నందుకుగానూ రాష్ట్ర పాలనా వ్యవస్థను ప్రధానమంత్రి అభినందించారు. లంచగొండితనం, బంధుప్రీతికి తావులేకుండా పారదర్శకమైన, ప్రతిభాధారిత ఉద్యోగ నియామక పద్ధతులను ఖచ్చితంగా అమలు చేయటాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఇటువంటి వ్యవస్థాగత సంస్కరణలను తీసుకురావటంలో ఎదురయ్యే రాజకీయ సవాళ్లను ఆయన అంగీకరించారు.
వ్యవసాయ సంక్షేమం పట్ల ప్రభుత్వానికున్న అచంచలమైన నిబద్ధతను ప్రధానమంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ను రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా అభివర్ణించిన ఆయన.. రైతులకు నేరుగా అందిన భారీ ఆర్థిక ప్రయోజనాల గురించి వెల్లడించారు. ఈ ప్రభుత్వ మద్దతును గణాంకాల్లో వివరిస్తూ… పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రాష్ట్ర రైతులు దాదాపు రూ. 8,000 కోట్లు అందుకున్నారని, ఇందులో స్థానిక రైతులకు గణనీయమైన వాటా లభించిందని వెల్లడించారు. “కేవలం జింద్ జిల్లాలోని రైతులకు ఇప్పటివరకు రూ. 600 కోట్లకుపైగా నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
దేశ సుదీర్ఘ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని కొనియాడుతూ.. ఈ ప్రాంతాన్ని గొప్ప చారిత్రక వారసత్వానికి సజీవ కేంద్రంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. మహారాజా రంజిత్ సింగ్ వైభవోపేతమైన వారసత్వాన్ని, పాండవుల పవిత్రమైన విశ్వాసాన్ని స్మరించుకుంటూ.. లక్షలాది మంది భక్తులను ఆకర్షించే స్థానిక పుణ్యక్షేత్రాల గురించి ప్రస్తావించారు. ” నేటి ఆధునిక భారతదేశం సగర్వంగా కాపాడుకుంటూ వస్తున్న విశ్వాస, ఆధ్యాత్మిక వైభవ వారసత్వ సంపద ఇదే” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
చరిత్ర పట్ల ఉన్న గౌరవాన్ని భవిష్యత్ విద్య, సాంస్కృతిక ప్రయత్నాలతో ముడిపెడుతూ.. దేశ చరిత్రను రాబోయే తరాలకు పూర్తి గౌరవంతో అందించేందుకు దేశం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు కురుక్షేత్రలో సరికొత్త సిక్కు మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. “ఈ నూతన మ్యూజియం భారతదేశ గురు పరంపరను రాబోయే తరాలకు విజయవంతంగా, సగర్వంగా అందిస్తుంది” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగిస్తూ.. వ్యవసాయం, పరిశ్రమలనే రెండు ఆర్థిక చక్రాల సమాన బలంతో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టులు ఈ వేగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని కాంక్షిస్తూ.. దేశ పురోగతిలో ఈ ప్రాంతం అందించే కీలక సహకారంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “హర్యానా సాధిస్తున్న ఈ వేగవంతమైన అభివృద్ధి.. వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న మన ప్రయాణానికి మరింత బలాన్ని, శక్తిని చేకూరుస్తుంది” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
***
Happy to be in Jind. Speaking at the launch of projects that strengthen clean mobility, connectivity, healthcare and cultural heritage. Together, they will improve 'Ease of Living' and accelerate Haryana's development. https://t.co/6DwHX6g4gF
— Narendra Modi (@narendramodi) July 17, 2026
India gets its first hydrogen train. pic.twitter.com/Ep7dZJZa0q
— PMO India (@PMOIndia) July 17, 2026
Connectivity not only enhances convenience but also multiplies the pace of development. pic.twitter.com/g4SaJoCIEl
— PMO India (@PMOIndia) July 17, 2026
Building a stronger sporting ecosystem. pic.twitter.com/W0i1KCPHfm
— PMO India (@PMOIndia) July 17, 2026
India takes a major leap towards green mobility!
— Narendra Modi (@narendramodi) July 17, 2026
In Jind, flagged off India’s first indigenous hydrogen-powered train between Jind and Sonipat.
This remarkable achievement reflects the ingenuity and dedication of the Indian Railways team. It is a proud symbol of Aatmanirbhar… pic.twitter.com/hVo89u5vvI
India takes a major leap towards green mobility!
— Narendra Modi (@narendramodi) July 17, 2026
In Jind, flagged off India’s first indigenous hydrogen-powered train between Jind and Sonipat.
This remarkable achievement reflects the ingenuity and dedication of the Indian Railways team. It is a proud symbol of Aatmanirbhar… pic.twitter.com/hVo89u5vvI
जींद के विकास कार्यक्रम में हरियाणा के अपने परिवारजनों का उत्साह नई ऊर्जा से भर गया। pic.twitter.com/rEYJaiXs2k
— Narendra Modi (@narendramodi) July 17, 2026
जींद से सोनीपत के बीच शुरू हुई देश की पहली हाइड्रोजन ट्रेन 21वीं सदी की टेक्नोलॉजी की दिशा में भारत का एक बड़ा कदम है। इस ट्रेन के सामर्थ्य के बारे में सुनकर हर देशवासी को बहुत गर्व होगा! pic.twitter.com/KCkeftRuk4
— Narendra Modi (@narendramodi) July 17, 2026
आज अगर 2014 से पहले की स्थिति होती तो वैश्विक तेल संकट से भारत की रेल व्यवस्था ठप पड़ जाती। लेकिन हमारी सरकार बहुत पहले सोचती भी है और समस्या का समाधान भी जमीन पर उतारती है, जिसके सुपरिणाम देश देख रहा है। pic.twitter.com/DYRAb4tUEy
— Narendra Modi (@narendramodi) July 17, 2026
हरियाणा की डबल इंजन सरकार स्पोर्ट्स में भी यहां के बेटे-बेटियों को हर सुविधा दे रही है। आने वाली महत्वपूर्ण स्पर्धाओं के लिए राज्य के युवा साथियों से मेरा यह विशेष आग्रह… pic.twitter.com/XtQONRPr8m
— Narendra Modi (@narendramodi) July 17, 2026