Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం పార్ల‌మెంటు స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర కేబినెట్ తొలి స‌మావేశం 17 వ లోక్‌స‌భ స‌మావేశాలు 2019 జూన్ 17 వ తేదీ సోమ‌వారం నాడు ప్రారంభించేందుకు అలాగే, ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల అవ‌స‌ర‌త‌కు లోబడి స‌భా కార్య‌క‌లాపాల‌ను 2019 జూలై 26 వ తేదీకి ముగించేందుకు ఆమోదం తెలిపింది.

రాజ్య‌స‌భ స‌మావేశాలు 2019 జూన్ 20 నుంచి ప్రారంభించి , ప్ర‌భుత్వ అవ‌స‌ర‌త‌కు లోబ‌డి 2019 జూలై 26 వ తేదీన ముగించేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

స్పీక‌ర్ ఎన్నిక 2019 జూన్ 19న జ‌రుగుతుంది.

రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 87(1) ప్ర‌కారం, 2019 జూన్‌20 వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు, పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌లో స‌మావేశ‌మ‌య్యే పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల సంయుక్త స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించాల్సిందిగా రాష్ట్ర‌ప‌తి గారికి విజ్ఞ‌ప్తి చేస్తారు.

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి కేంద్ర బ‌డ్జెట్‌ను 2019 జూలై 5 వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు లోక్ స‌భ‌కు స‌మ‌ర్పిస్తారు. బ‌డ్జెట్ స‌మ‌ర్ప‌ణ అనంత‌రం ఆయా స‌భ‌లు ఆరోజు వాయిదా ప‌డ‌తాయి.