పిఎంఇండియా
ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం 7 వ కేంద్ర వేతన సంఘం కాలపరిమితిని 4 నెలల పాటు అనగా డిసెంబర్ 31, 2015 వరకు పొడిగింపుకు ఆమోదం తెలిపింది.
నేపథ్యంః
7 వ కేంద్ర వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2014 న ఏర్పాటు చేసింది. అదే రోజు ఆమోదించిన తీర్మానం మేరకు వేతన కమీషన్ 18 నెలలలోపు అనగా ఆగస్టు 27, 2015 వరకు తన నివేదికను సమర్పించాల్సి వుంది. పనిభారం, అన్ని వర్గాలతో సంప్రదింపులు దృష్ట్యా వేతన సంఘం నివేదిక సమర్పించడానికి డిశంబర్ 31, 2015 వరకు గడువును పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది.