పిఎంఇండియా
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి, పార్లమెంటు సభ్యురాలు పెన్నీ వాంగ్తో సమావేశమవ్వడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో భారత్–ఆస్ట్రేలియా మధ్య రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, వస్తు సరఫరా వ్యవస్థ పటిష్టతను నిర్ధారించడం వంటి రంగాల్లో బలపడుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు చర్చించారు.
స్వేచ్ఛాయుత, పారదర్శక, సురక్షిత, సుసంపన్నమైన ఇండో–పసిఫిక్ కోసం భారత్, ఆస్ట్రేలియా ఎప్పటికీ కలిసి పనిచేస్తూనే ఉంటాయని ఇరు దేశాల నేతలు స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి, పార్లమెంటు సభ్యురాలు పెన్నీ వాంగ్ను కలవడం సంతోషంగా ఉంది. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, వస్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడటం వంటి రంగాల్లో విస్తరిస్తున్న భారత్–ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి మేం చర్చించాం. స్వేచ్ఛాయుత, పారదర్శక, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో–పసిఫిక్ కోసం భారత్, ఆస్ట్రేలియా కలిసి పనిచేస్తూనే ఉంటాయి’’.
***
Happy to receive Senator Penny Wong, Minister for Foreign Affairs of Australia. We discussed the growing India-Australia Comprehensive Strategic Partnership in areas such as defence, trade, technology and ensuring supply chain resilience. India and Australia will continue to work… pic.twitter.com/YzNOwCx3YU
— Narendra Modi (@narendramodi) May 26, 2026