Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్ర పర్భణీలో ఘోర ప్రమాదం.. గోడ కూలి ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి తీవ్ర విచారం


మహారాష్ట్రలోని పర్భణీలో గోడ కూలి ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

 

ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. 

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

 

‘‘మహారాష్ట్రలోని పర్భణీలో గోడ కూలడం వల్ల ప్రాణనష్టం సంభవించడం తీవ్ర విచారకరం. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

***