పిఎంఇండియా
ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, భారత పర్యావరణ వారసత్వంలో అంతర్భాగంగా ఉన్న మహా ఏనుగుల ఉత్సవాన్ని ఇవాళ నిర్వహించుకొంటున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసియా ఏనుగుల జాతిలో 60 శాతానికి పైగా భారత్లో మనుగడ సాగిస్తుండడం పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు.
మన దేశంలో 33 అభయారణ్యాలు గజరాజులకు నిలయంగా ఉన్నాయనీ, దీర్ఘకాలిక ప్రాతిపదికన సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామనీ, ఇందులో అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, పశువైద్యులు, మావటులతో పాటు స్థానికులు కూడా కీలక పాత్ర పోషిస్తుండడం సంతోషదాయకమని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ఏనుగులు భారత పర్యావరణ వారసత్వంలో ఓ అంతర్భాగం. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏనుగుల ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రపంచమంతటా ఉన్న ఆసియా ఏనుగుల జాతిలో 60 శాతానికి పైగా ఏనుగులు భారత్లో ఉండటం సంతోషదాయకం. మన దేశంలో 33 అభయారణ్యాలు గజరాజులకు నిలయంగా ఉన్నాయనీ, దీర్ఘకాలిక ప్రాతిపదికన సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామనీ ఆయన తెలిపారు. ఈ ప్రయత్నాల్లో అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, పశువైద్యులు, మావటులతో పాటు స్థానికులూ కీలక పాత్ర పోషిస్తుండడం ఆనందకరం’’ అని పేర్కొన్నారు.
***
On World Elephant Day, we celebrate the majestic elephant which has remained an integral part of India’s ecological heritage. It is gladdening that India is home to over 60% of the world’s wild Asian elephants. Our nation has 33 Elephant Reserves, which provide habitats for… pic.twitter.com/0hOaWcoBPQ
— Narendra Modi (@narendramodi) August 12, 2026