Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తర ప్రదేశ్ లోని లఖ్ నవూ లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి

ఉత్తర ప్రదేశ్ లోని లఖ్ నవూ లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి

ఉత్తర ప్రదేశ్ లోని లఖ్ నవూ లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి

ఉత్తర ప్రదేశ్ లోని లఖ్ నవూ లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లఖ్ నవూ లో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ టెక్నికల్ యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించారు. 400 కెవి సామర్థ్యం కలిగిన లఖ్ నవూ-కాన్ పుర్ డి/ సి ట్రాన్స్ మిషన్ లైనును దేశ ప్రజలకు అంకితమిచ్చారు. అలాగే, ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు కూడా.

ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రసంగిస్తూ, అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో భారతదేశాన్ని జోడించటాన్ని గురించి సుదీర్ఘంగా వివరించారు. ‘‘మన యువతీయువకులు స్టార్ట్ అప్ లను గురించి మరియు ఆరోగ్య రంగంలో నూతన ఆవిష్కారాలను గురించి, మరీ ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ సామగ్రి విషయంలో ఆలోచనలు చేయాల’’ని ప్రధాన మంత్రి సూచించారు.

అన్ని జిల్లాలకు విద్యుచ్ఛక్తి సరఫరా అయ్యేటట్లు శ్రద్ధ తీసుకొన్నందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి అభినందించారు. ‘‘ఒక దేశం అభివృద్ధి వైపు పయనించే క్రమంలో విద్యుత్తు మరియు శక్తి అపార ప్రభావాన్ని ప్రసరింపచేస్తాయి. ఇవాళ సౌర శక్తి భారతదేశంలో ప్రజాదరణ పొందుతోంది’’ అని ఆయన అన్నారు.

జులై 1వ తేదీ నుండి అమలు కానున్న జిఎస్ టి ని గురించి కూడా ప్రధాన మంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ఇది ప్రజాస్వామ్యం యొక్క శక్తిని చాటింది’’ అని ఆయన చెప్పారు. ‘‘జిఎస్ టి అమలు యొక్క ఖ్యాతి భారతదేశపు 125 కోట్ల మందికి చెందుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.