Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏప్రిల్ 21న రాజస్థాన్‌లో ప్రధాని పర్యటన


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఏప్రిల్ 21న రాజస్థాన్లో పర్యటిస్తారుఆ రోజు ఉదయం 11:30 గంటలకు బలోత్రాలోని పచ్‌పద్రా వద్ద దేశంలోనే మొదటిసారి ఏర్పాటు చేసిన సమీకృత చమురుశుద్ధిపెట్రో రసాయన కర్మాగార సముదాయాన్ని జాతికి అంకితం చేస్తారుఅక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

భారత దేశ ఇంధన భద్రతపెట్రోరసాయనాల రంగంలో సాధించిన విజయాన్ని ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సూచిస్తుందిహిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయిఏడాదికి మిలియన్ల మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏసామర్థ్యం ఉన్న ఈ చమురు శుద్ధిపెట్రో రసాయనాల సముదాయాన్ని రూ.79,450 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మించారు.

 

అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ సముదాయం 2.4 ఎంఎంటీపీఏల సామర్థ్యంతో చమురు శుద్ధినిపెట్రో రసాయనాల ఉత్పత్తిని ఏకీకృతం చేస్తుందిసామర్థ్యంసుస్థిరతలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ చమురు శుద్ధి కర్మాగారం 17.0 అధిక నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్సును కలిగి ఉంది. 26 శాతం కంటే ఎక్కువ పెట్రో రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.

 

దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలోపెట్రో రసాయనాల్లో స్వయం సమృద్ధిని విస్తరించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారుఅలాగేఈ ప్రాంతంలో పెట్రో రసాయనప్లాస్టిక్ పార్కు అభివృద్ధికి అవసరమైన ప్రధాన పరిశ్రమగా పనిచేయడంతో పాటు అనుబంధ పరిశ్రమలనుఅనుబంధ రంగాలను ప్రోత్సహిస్తుందిఅదనంగాగణనీయ స్థాయిలో ఉద్యోగావకాశాలను కల్పించి.. ఈ ప్రాంత సామాజికఆర్థికాభివృద్ధికి ఈ చమురుశుద్ధి కర్మాగారం సహకారం అందిస్తుంది.

 

***