Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఓమాన్ లోని మ‌స్క‌ట్ లో 2018 ఫిబ్ర‌వ‌రి 11న జ‌రిగిన ఒక క‌మ్యూనిటీ ఈవెంట్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఓమాన్ లోని మ‌స్క‌ట్ లో 2018 ఫిబ్ర‌వ‌రి 11న జ‌రిగిన ఒక క‌మ్యూనిటీ ఈవెంట్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఓమాన్ లోని మ‌స్క‌ట్ లో 2018 ఫిబ్ర‌వ‌రి 11న జ‌రిగిన ఒక క‌మ్యూనిటీ ఈవెంట్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఓమాన్ లోని మ‌స్క‌ట్ లో 2018 ఫిబ్ర‌వ‌రి 11న జ‌రిగిన ఒక క‌మ్యూనిటీ ఈవెంట్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


మ‌న దేశంలో 2014వ సంవ‌త్స‌రాని క‌న్నా ముందు ఒక ఎల్ఇడి బ‌ల్బు 350 రూపాయ‌ల‌కు పైబడిన ధ‌ర‌లో అమ్ముడు పోయేది; అదే ఎల్ ఇడి బల్బు ఇప్పుడు 40- 45 రూపాయ‌ల‌కు దొరుకుతోంది.  త‌క్కువ ధ‌ర‌కు  ఎల్ఇడి బ‌ల్బులు దొరుకుతుండడమే కాక వాటిని ఉప‌యోగిస్తున్న కుటుంబాలు ఒక సంవ‌త్స‌రంలో విద్యుత్తు బిల్లుల రూపేణా దాదాపు 15,000 కోట్ల రూపాయ‌లు ఆదా చేయ‌గ‌లిగారు.

 

ఇవాళ ప్ర‌తి భార‌తీయుడు ఒక ‘న్యూ ఇండియా’ స్వ‌ప్నాన్ని సాకారం చేసే దిశ‌గా కృషి చేస్తున్నాడు.  మేము పేద‌ల‌లో కెల్లా అత్యంత పేద వ్యక్తి సైతం అభివృద్ధి స‌మానావ‌కాశాన్ని పొంద‌గ‌లిగే మ‌రియు పేద‌ల‌లో కెల్లా అత్యంత పేద వ్యక్తి సైతం క‌ల‌లు క‌ని, వాటిని పండించుకొనే దిశ‌గా సాగుతున్నాం.

 

ఇవాళ నేను నా క‌ళ్ళెదుట ఒక బుల్లి భార‌త‌దేశాన్ని చూస్తున్నాను.  దేశం లోని ప్ర‌తి ఒక్క మూల నుండి వచ్చిన భార‌తీయులు, వేరు వేరు రంగాల‌లో ప‌ని చేస్తున్న భారతీయులు ఒక గొప్ప సన్నివేశాన్ని ఆవిష్కరిస్తున్నారు.

 

నేను 10 సంవ‌త్స‌రాల క్రితం ఓమాన్ లో ప‌ర్య‌టించాను.  అప్ప‌ట్లో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా నేను ఆఫ్రికాకు వెళ్తూ, మార్గమ‌ధ్యంలో స‌లాలా గుండా ప్రయాణించాను.  నేను ఓమాన్ ను సంద‌ర్శించి మీ అంద‌రితోనూ భేటీ అవ్వాల‌ని, మీ మ‌ధ్య కొంత స‌మ‌యాన్ని వెచ్చించాల‌ని అప్ప‌ట్లో ఆరాటపడ్డాను.  ఆ అవ‌కాశం ఈ రోజున నాకు ల‌భించింది.  ఓమాన్ కు, భార‌త‌దేశానికి మ‌ధ్య ఉన్న సంబంధాలు వంద‌లాది, వేలాది సంవ‌త్స‌రాల కిందటివి.  గ‌త మూడేళ్ళుగా మేము గల్ఫ్ దేశాలతో భార‌త‌దేశానికి ఉన్న ప్రాచీన‌మైన మ‌రియు స్నేహ‌ పూర్వ‌క‌మైన సంబంధాల‌కు- ప్ర‌స్తుత అవ‌స‌రాల‌తో తుల‌తూగేటటువంటి ఒక విధానాన్ని రూపొందించడం ద్వారా- ఒక కొత్త రూపురేఖలను అందిస్తూ వస్తున్నాం.

 

భార‌త‌దేశం యొక్క స్థాయి మరియు ప్రగతి తో పాటే భారతదేశంలో గ‌ల్ఫ్ దేశాల ప్ర‌యోజ‌నాలు ఏ స్థాయి వర‌కు ఎదిగాయో మీరందరూ కూడాను గ‌మ‌నించే ఉంటారు.

 

సహజంగానే, ఓమాన్ తో భార‌త‌దేశానికి ఉన్న‌టువంటి చారిత్ర‌క సంబంధాల‌లో ఒక కొత్తదైన కదలిక వచ్చింది.  శ్రేష్ఠులైన సుల్తాన్ గారు సైతం భార‌త‌దేశంతో విశిష్టమైన సంబంధాన్ని ఏర్ప‌ర‌చుకొన్నారు.  వారి పేరిట స్థాపించ‌బ‌డిన ఈ క్రీడా మైదానంలో ఈ రోజున నేను నిల‌బ‌డి, ఇంత పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చిన మిమ్మల్ని ఉద్దేశించి సంభాషించ‌డం ఒక ప్ర‌త్యేక ప్రాముఖ్యాన్ని సంత‌రించుకొంది.

 

ఇది భార‌త‌దేశ‌మ‌న్నా, భార‌తీయుల‌న్నా శ్రేష్ఠులైన సుల్తాన్ గారికి ఎంతటి  అభిమానం ఉన్నదీ చెప్ప‌క‌నే చెబుతోంది.  ఈ ప్ర‌త్యేకమైన స‌త్కారం ప‌ట్ల ఆయ‌న‌కు మేము అమిత కృత‌జ్ఞుల‌మై ఉన్నాం.

 

మేము ‘క‌నీస స్థాయి ప్ర‌భుత్వం- గ‌రిష్ట స్థాయి పాల‌న’ సూత్రాన్ని అనుస‌రించ‌డం ద్వారా దేశం లోని సామాన్య మాన‌వుడి జీవ‌నాన్ని స‌ర‌ళ‌త‌రంగా మార్చేందుకుగాను కృషి చేస్తున్నాం.

 

మేము ఈ అన్ని అంశాల‌ను ప్ర‌భుత్వ సంస్కృతిలో మిళితం చేశాం.  ప్ర‌క్రియ‌ల‌ను స‌ర‌ళ‌త‌రం చేశాం;  అన‌వ‌స‌ర‌మైన చ‌ట్టాల‌ను ర‌ద్దు చేశాం; ప్ర‌భుత్వ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తుల సంఖ్య‌ను 40- 50 పేజీల నుండి 4- 5 పేజీల‌కు త‌గ్గించాం;  ఆ ద‌ర‌ఖాస్తులను ఆన్‌ లైన్ లో భ‌ర్తీ చేసేటట్టు ఒక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశాం;  ప్ర‌జ‌ల ఇక్క‌ట్ల‌ను చిత్త శుద్ధితో ఆల‌కించి, వాటిని ప‌రిష్క‌రించే ప‌నిలో నిమ‌గ్నమయ్యాం.

 

ప‌రివ‌ర్త‌న‌కు లోనైన‌ భార‌త‌దేశంలో ప్ర‌స్తుతం పేద ప్ర‌జ‌లు బ్యాంకులలో  అవ‌మానాల‌ పాలై తిరుగుముఖం పట్టడం జరగడం లేదు.  మారిన భార‌త‌దేశంలో ప్ర‌భుత్వం గ్యాస్ క‌నెక్ష‌న్ ను ఇవ్వ‌డానికి, విద్యుత్ క‌నెక్ష‌న్ ను ఇవ్వ‌డానికి ఇంటి ముంగిట‌కు వ‌స్తోంది.

 

పేద ప్ర‌జ‌ల‌కు రోజుకు 1 రూపాయి ప్రీమియంతో భ‌ద్ర‌త బీమా నుమ‌రియు రోజుకు 90 పైస‌ల ప్రీమియంతో జీవ‌న బీమా ను క‌ల్పించ‌డ‌మైంది.  ఈ బీమా ప‌థ‌కాల‌లో భాగంగా పేద‌వారికి క్లెయిమ్ రూపంలో 2,000 కోట్ల రూపాయ‌ల‌ను ఇవ్వడమైంది.

 

బ‌డ్జెట్ లో మేము ప్ర‌క‌టించినటువంటి ఒక ప‌థ‌కం యావ‌త్ ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది.  ‘ఆయుష్మాన్ భార‌త్’ ప‌థ‌కంలో భాగంగా  దేశం లోని 10 కోట్ల పేద కుటుంబాల‌కు.. అంటే సుమారు 45-50 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు.. ‘ఆరోగ్య బీమా’ ను మేము అందిస్తున్నాం.  ఒక్కొక్క పేద ప‌రివారానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఉచిత చికిత్సకు మేము హామీని ఇచ్చాం.

 

ప్ర‌స్తుతం దేశంలో 21వ శ‌తాబ్ద అవ‌స‌రాల‌ను ప‌రిగ‌ణ‌న లోకి తీసుకుంటూ త‌దుప‌రి త‌రం మౌలిక స‌దుపాయాల‌ను అభివృద్ధి పరచడం జ‌రుగుతోంది.  ప్ర‌త్యేకించి మేము ర‌వాణా రంగాన్ని అందులోని వివిధ విభాగాలు ఒక‌దానిని మ‌రొక‌టి తోడు తీసుకొని వెళ్ళే విధంగా అభివృద్ధిప‌రుస్తున్నాం.

 

హైవేలు, ఏర్ వే లు, రైల్వేలు, ఇంకా జ‌ల మార్గాలు.. వీట‌న్నింటినీ ఒక‌దానితో మ‌రొక దానిని వాటి వాటి అవ‌స‌రాల ప్ర‌కారం ఏకీకృత ప‌ర‌చ‌డమైంది.

 

‘భార‌త్ మాలా’ ప్రాజెక్టులో భాగా 53 వేల కిలో మీట‌ర్ల మేర జాతీయ ర‌హ‌దారుల‌ను నిర్మించే ప‌నులు మొద‌ల‌య్యాయి.  దేశంలోని వివిధ ప్రాంతాల‌లో రైల్వే కారిడార్లను అభివృద్ధిప‌ర‌చే ప‌ని సాగుతోంది.  మెట్రో రైలు వ్య‌వ‌స్థ‌ను దేశంలోని 11 పెద్ద న‌గ‌రాల‌కు విస్త‌రించ‌డం జ‌రిగింది.  దేశ కోస్తా తీర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేయ‌డానికి మ‌రియు త‌త్సంబంధిత మౌలిక స‌దుపాయాల‌ను స‌మ‌కూర్చ‌డానికి ‘సాగ‌ర్ మాల’ పేరుతో ఒక కార్య‌క్ర‌మాన్ని మేము నిర్వ‌హిస్తున్నాం.

 

మ‌త్స్య‌కార స‌ముదాయం లోని సోద‌రుల కోసం ఒక ‘నీలి విప్ల‌వ’ ప‌థ‌కాన్ని మేము ప్రారంభించాం.  ఆధునిక ట్రాల‌ర్ల కొనుగోలు కోసం వారికి స‌హాయాన్ని అందిస్తున్నాం.  అంతేకాకుండా ప్ర‌భుత్వం దేశంలో 110 కి పైగా జ‌ల మార్గాల‌ను అభివృద్ధిప‌రుస్తోంది.

 

భార‌త‌దేశంలో నిర్ణ‌యాలు చేయ‌డంలో ప్ర‌స్తుతం జాప్యం జరగడం లేదు;  అలాగే, ప్ర‌స్తుతం స‌వాళ్ళ‌కు ఎదురొడ్డడం జ‌రుగుతోంది.  ప్రాజెక్టుల‌కు ల‌క్ష్యాన్ని నిర్దేశించ‌డం ద్వారా స‌కాలంలో వాటిని పూర్తి చేయ‌డం జ‌రుగుతోంది.  ఇది  భార‌త‌దేశం యొక్క మారుతున్న ప‌ని సంస్కృతికి ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది.  ఇది ఒక ‘న్యూ ఇండియా’ తాలూకు ఉదాహ‌ర‌ణ‌ ఇది.

 

నిర్ణ‌యాల‌ను ఒక స్ప‌ష్ట‌మైన అంతఃక‌ర‌ణ‌తో, చ‌క్క‌గా నిర్దేశించిన‌టువంటి ఒక విధానానికి లోబ‌డి తీసుకొంటున్న‌ట్ల‌యితే దేశం యొక్క నిధుల‌ను మిగ‌ల్చుకోవ‌డం సాధ్య‌ప‌డుతుంది.  ఎప్పుడైతే ప‌నులు స‌మ‌ర్థ‌మైన ప‌ద్ధ‌తిలో సాగుతుంటాయో, ఎప్పుడైతే ప్ర‌స్తుత వ‌న‌రుల‌ను అత్యుత్త‌మ రీతిలో వినియోగించుకొంటుంటామో అటువంట‌ప్పుడు దేశం తాలూకు నిధులు ఆదా అవుతాయి.

 

దేశ అభివృద్ధిలో మ‌రియు జాతి నిర్మాణంలో మిమ్మ‌ల్ని ఒక ముఖ్య భాగ‌స్వామిగా నేను భావిస్తున్నాను.  ఒక ‘న్యూ ఇండియా’ ను ఆవిష్క‌రించ‌డం కోసం మీరు పూనిన ప‌విత్ర ప్ర‌తిజ్ఞ‌ల ప్ర‌భావాన్ని భార‌త‌దేశంలో కూడా చూడ‌వ‌చ్చును.

 

 

***