పిఎంఇండియా
గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో ప్రాణనష్టం జరిగిన ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం విచారకరం. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.
***
The loss of lives due to a mishap in Valsad, Gujarat, is saddening. My thoughts are with the bereaved families in this hour of grief. Praying for the swift recovery of the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 22, 2026