పిఎంఇండియా
భరతమాత వీరపుత్రుడు, ప్రసిద్ధ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
బానిస సంకెళ్ల నుంచి భరతమాతను విముక్తి చేసేందుకు ఆజాద్ సర్వస్వాన్ని త్యాగం చేశారని, ఆయన చేసిన కృషిని దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందన్నారు.
అమరుడైన విప్లవకారుడి వారసత్వాన్ని స్మరించుకుంటూ.. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలన్న దృఢ సంకల్పమే నిజమైన పరాక్రమానికి నిదర్శనమని చంద్రశేఖర్ ఆజాద్ జీవితం నిరూపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాతృభూమి కోసం ఆయన చేసిన త్యాగం, దేశంలోని ప్రతీ తరానికి స్ఫూర్తిదాయకమని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“భరతమాత వీరపుత్రుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా నా హృదయపూర్వక నివాళులు. బానిస సంకెళ్ల నుంచి భరతమాతకు విముక్తి కల్పించేందుకు ఆయన సర్వస్వం త్యాగం చేశారు. దేశం ఆయన్ని ఎల్లప్పుడూ స్మరించుకుంటుంది.
అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలనే సంకల్పంలోనే నిజమైన శౌర్యం ఉందని విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ జీవితం నిరూపిస్తుంది. మాతృభూమి కోసం ఆయన చేసిన త్యాగం దేశంలోని ప్రతీ తరానికి స్ఫూర్తినిస్తుంది.
న హి శౌర్యత్పరం కిచ్చిత్ త్రిషు లోకేషు విద్యతే
శూరః సర్వం పాలయతి సర్వం శూరే ప్రతిష్ఠితం“
“ముల్లోకాల్లోనూ శౌర్యానికి మించినది లేదు. జీవ, నిర్జీవ ప్రపంచాన్ని పోషించే, భద్రత కల్పించే ప్రాథమిక శక్తి శౌర్యం. గౌరవం, సుసంపన్నత, కర్తవ్యం ధైర్యవంతుడి పరాక్రమంలోనే ఉంటాయి“
***
भारत माता के वीर सपूत चंद्रशेखर आजाद के बलिदान दिवस पर उन्हें मेरी आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने मां भारती को गुलामी की बेड़ियों से आजाद कराने के लिए अपना सर्वस्व न्योछावर कर दिया, जिसके लिए वे सदैव स्मरणीय रहेंगे।
— Narendra Modi (@narendramodi) February 27, 2026
अमर क्रांतिकारी चंद्रशेखर आजाद का जीवन बताता है कि अन्याय के खिलाफ अडिग रहने का संकल्प ही सच्चा पराक्रम है। मातृभूमि के लिए उनके बलिदान की गाथा देश की हर पीढ़ी को प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) February 27, 2026
न हि शौर्यात्परं किञ्चित् त्रिषु लोकेषु विद्यते।
शूरः सर्वं पालयति सर्वं शूरे प्रतिष्ठितम् ।। pic.twitter.com/h6fZZfRWKa