Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“జ్యుడీషియల్ రిఫామ్స్ – రీసెంట్ గ్లోబల్ ట్రెండ్స్” గ్రంథాన్ని ఆవిష్కరించిన ప్ర‌ధాన మంత్రి; తొలి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ “జ్యుడీషియల్ రిఫామ్స్ – రీసెంట్ గ్లోబల్ ట్రెండ్స్” గ్రంథాన్ని ఈ రోజు ఆవిష్కరించారు. ఆ పుస్తకం ఒకటో ప్రతి ని రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ కి అందించారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మారుతున్న సాంకేతిక విజ్ఞానానికి, నూతనమూ, పరస్పర ఆధారితమూ అయిన ప్రపంచ క్రమానికి అనుగుణంగా భారతదేశం సమ స్థాయిలో ఉండాలన్నారు. ప్రపంచంలో కీలకమైన పాత్రను పోషించే అవకాశం భారతదేశానికి ఉందని, ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే, వేగంగా చోటుచేసుకొంటున్న మార్పులకు తగ్గట్టు విధానాలను భారతదేశం త్వరితగతిన రూపొందించుకొని తీరాలన్నారు.

రోజుకు ఒక చట్టం వంతున రద్దు చేస్తానని తాను వాగ్దానం చేసిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తెస్తూ, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సుమారు 1200 చట్టాలను రద్దుచేసినట్లు తెలిపారు. దక్షత కలిగిన పాలన న్యాయవ్యవస్థ భారాన్ని తగ్గించగలుగుతుందని ఆయన అన్నారు.