పిఎంఇండియా
ప్రాజెక్టులో ఈ కింది పనులు కూడా కలిసి ఉంటాయి:
ఎ. సామగ్రి యొక్క ఇంజినీరింగ్, డిజైన్, నిర్మాణం మరియు నిర్వహణకు అవసరమైన సర్వేక్షణలు,
బి. సామగ్రి యొక్క మౌలిక ప్రణాళికరచన, ఇంజినీరింగ్ మరియు డిజైన్,
సి. సామగ్రి యొక్క తయారీ మరియు రవాణా,
డి. సివిల్ వర్క్, నిర్మాణం మరియు స్థాపన,
ఇ. సామగ్రి యొక్క కమిషనింగ్,
ఎఫ్. సామగ్రి యొక్క డెమన్ స్ట్రేషన్, మరియు
జి. భారతదేశంలో సాంకేతిక విజ్ఞానం ప్రచారం.
ఈ ఎమ్ ఒ యు పై సంతకాలు జరిగిన తేదీ నాటి నుండి ఇది అమలులోకి రాగలదు మరియు 2020 మార్చి 31 వరకు అమలులో ఉండగలదు.
భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ మరియు శక్తి ని సమర్ధంగా వినియోగించడం కోసం తోడ్పాటును అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. ఇందుకోసం ఎఐఐఎమ్ఎస్ ఢిల్లీ లో ఎనర్జి ఎఫిషియెంట్, ఇంకా ఐటి సంబంధి సామగ్రిని నెలకొల్పుతారు. అంతే కాకుండా, ఆ శక్తి నిర్వహణ వ్యవస్థను, ఐటి వ్యవస్థను ప్రదర్శిస్తారు కూడా. ఎక్విప్ మెంట్ డెమన్ స్ట్రేషన్ ద్వారా టెక్నాలజీని విస్తృతంగా ప్రచారంలోకి తేవడం కోసం
కృషి చేస్తారు.