పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాష్ కెంత్ లో షాంఘయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సి ఒ) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ తో భేటీ అయ్యారు. ఎస్ సి ఒ లో భారతదేశ ప్రవేశాన్ని ప్రెసిడెంట్ శ్రీ శీ జిన్ పింగ్ స్వాగతించారు. ఎస్ సి ఒ లో భారతదేశ ప్రవేశం ఎస్ సి ఒ ను బలోపేతం చేయగలని ప్రెసిడెంట్ శ్రీ శీ జిన్ పింగ్ అన్నారు. ఎస్ సి ఒ లో భారతదేశ సభ్యత్వం పట్ల చైనా తరఫున మద్దతు తెలిపినందుకు ప్రెసిడెంట్ శ్రీ శీ జిన్ పింగ్ కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. సియోల్ లో జరుగనున్న ఎన్ ఎస్ జి సర్వ సభ్య సమావేశాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రస్తావించారు. ఎన్ ఎస్ జి లో భారతదేశ సభ్యత్వం అంశాన్ని ఈ సర్వ సభ్య సమావేశంలో చర్చించనున్నారు. ఎన్ ఎస్ జి లో సభ్యత్వం కోసం భారతదేశం పెట్టుకున్న దరఖాస్తుపై చైనా న్యాయమైన, యదార్థమైన అంచనాను వేసుకొని, ఆ దరఖాస్తు యొక్క యోగ్యతపైన తనదైన నిర్ణయాన్ని తీసుకోవలసిందిగా ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. సియోల్ లో వ్యక్తమవుతున్న ఏకాభిప్రాయానికి చైనా తన వంతు తోడ్పాటును అందించాలని ఆయన అన్నారు.
Uzbekistan: PM @narendramodi and President Xi Jinping meet. pic.twitter.com/cxj9JfD0z5
— PMO India (@PMOIndia) June 23, 2016
Met President Xi Jinping. pic.twitter.com/FNjaqmJM9O
— Narendra Modi (@narendramodi) June 23, 2016